దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తో తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అయితే ఈ క్రమంలో తమిళ దిగ్గజ నటులు కమల్ హాసన్, రజినీకాంత్  రాజకీయ ఎంట్రీలతో తమిళనాడు రాజకీయాలలో రాజకీయం వేడెక్కింది. అయితే తాజాగా యువహీరో విశాల్ వీళ్లిద్దరు గురించి సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు. హీరో విశాల్ ఈమధ్య తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న అనేక సమస్యలపై స్పందించడం మనం చూస్తూనే ఉన్నాం.

ఈ క్రమంలో విశాల తీసుకుంటున్న తాజా నిర్ణయాలతో ప్రముఖంగా వార్తల్లోకి ఎక్కుతున్నారు. మొన్న ఆర్కేనగర్ ఉప ఎన్నికలలో పోటీ చేద్దామని అనుకున్న ఈసి నిర్ణయంతో అది సాధ్య పడలేదు. అయితే మాత్రం ఆయన రజనీకాంత్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని విశాల్ తెలియజేశాడు. అయితే ఇటీవల ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే రోజులలో తమిళనాడు రాజకీయాలలో పెను మార్పులు రావడం ఖాయమని హీరో విశాల్ తెలియజేశారు.

ఈ సందర్భంగా తమిళనాడు స్టార్ హీరోలు కమల్ హాసన్ రజనీకాంత్ రాజకీయాలలోకి రావడం శుభ పరిణామమని వాళ్లిద్దరూ వల్ల తమిళ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రజలు ఎటువైపు నిలుస్తారనేది మాత్రం చెప్పలేము అని అది సాధ్యం కాదని అన్నాడు. తాను ఇద్దరినీ సమర్థిస్తానని తెలిపాడు. ఇప్పుడు ఇద్దరి స్టార్స్ కలిస్తే బాగుంటుంది ఇద్దరికీ నేను సపోర్ట్ చేస్తాను అని తెలిపాడు విశాల్.


మరింత సమాచారం తెలుసుకోండి: