వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనాలు సృష్టిస్తుంది. ఈ క్రమంలో జగన్ జనంతో మమేకమవుతూ వారి కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జగన్ పాదయాత్ర వల్ల ప్రస్తుత రాజకీయాలలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ఈ సందర్భంగా జాతీయ ఛానల్ రిపబ్లిక్ టివి నిర్వహించిన సర్వేలో ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో వైయస్ఆర్ సీపీ హవా కొనసాగుతుందని సర్వేలో వెల్లడయింది. అయితే తాజాగా ఇంటర్నెట్ లో నెటిజన్లు ఎక్కువగా జగన్ గురించి సెర్చింగ్  చేస్తున్నట్లు వెల్లడయ్యింది. గూగుల్ ట్రేండింగ్ లో  జగన్ నంబర్ వన్ అట.

గడిచిన కొద్ది నెలల నుండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే జగన్ గురించి తెలుసుకునేందుకే నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపినట్లు గూగుల్ ట్రెండ్స్ స్పష్టం చేశాయి. మొత్తంమీద జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర వైయస్ఆర్సీపీ పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చింది అని చెప్పవచ్చు. అయితే పాదయాత్ర ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలోనే ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: