జనసేన అధినేత, పవర్స్టార్ పవన్కళ్యాణ్కు కోడిగుడ్డు ఫోబియా పట్టుకుందా ? ప్రస్తుతం ఆయన తెలంగాణ టూర్లో ఈ ఫోబియాతోనే తన రూట్ మ్యాప్ మార్చుకున్నాడా ? సోమవారం నుంచి పవన్ తెలంగాణలో చేపట్టిన ప్రజాయాత్ర షెడ్యూల్లో వరంగల్ జిల్లా లేకపోవడానికి ఇదే కారణమా ? అంటే అవుననే గుసగుసలు వరంగల్ జిల్లాలో వినిపిస్తున్నాయి. ఇక అసలు మ్యాటర్లోకి వెళితే తెలంగాణకు రెండో రాజధానిగా పేరున్న వరంగల్ జిల్లాను కాదని పవన్ కరీంనగర్ తర్వాత ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పర్యటిస్తున్నాడు.
సోమవారం కరీంనగర్ జిల్లా కొండగడ్డు నుంచి ప్రజాయాత్ర ప్రారంభించిన పవన్ మంగళవారం జగిత్యాలలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ మూడు జిల్లాల్లో పార్టీ సంస్థాగత స్థితిగతులపై చర్చించాక అక్కడి నుంచి నేరుగా కొత్తగూడెం చేరుకుని అక్కడే బస చేస్తారు. బుధవారం ఖమ్మం చేరుకుని ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో కీలకమైన వరంగల్ జిల్లాలో దిగకుండా పవన్ నేరుగా కొత్తగూడెం వెళ్లిపోవడం ఎంటబ్బా ? అన్న సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి.
ఓ సారి గతంలోకి వెళ్లి చూస్తే పవన్ అన్న చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు జరిగిన యాత్రలో పవన్ కూడా పాల్గొన్నాడు. నాడు పవన్ యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేశారు. పాత వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో చిరంజీవిపై కొందరు కోడిగుడ్లతో దాడి. చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ కోడిగుడ్లు విసిరడం అప్పట్లో సంచలనంగా మారింది.
ఇప్పుడు ప్రజారాజ్యం లేదు. చిరుకు జనసేనకు సంబంధం కూడా లేదు.ఇక ఇప్పుడు వరంగల్ జిల్లా పవన్ యాత్ర చేపడితే నాటి చేదు ఘటన మళ్లీ వార్తల్లోకి వస్తుందని...అది పవన్కు ఇష్టం లేకే పవన్ తన తాజా తెలంగాణ ప్రజాయాత్రలో వరంగల్ జిల్లాను తప్పించారి గుసగుసలు వరంగల్ జిల్లాలో వినిపిస్తున్నాయి.
జనసేన అధినేత గా మొదటి సారిగా ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో పాత విషయాలు చర్చకు రాకుండా జాగ్రత్త పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే జనసేన అభిమానులు, కార్యకర్తలు మాత్రం అలాంటిదేమి ఉండదని. పవన్ త్వరలోనే వరంగల్ జిల్లాలో పర్యటిస్తారని చెపుతున్నారు. ఇది పవన్ గుడ్డు ఫోబియా మ్యాటర్.