మన ప్రభుత్వాలు పాలనను ప్రజాస్వామ్య యుతంగా కాకుండా రాజకీయంగా నడుపుతున్నారు. ఒకసారి ఎన్నికలై ప్రభుత్వం ఏర్పడగానే ప్రజా పాలన జరగాలి తప్ప అక్కడ రాజకీయాలు ఏమాత్రం ఉండరాదనేది రాజ్యాంగ ప్రధాన సూత్రం. అంటే ఎన్నికలప్పుడు ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలి. కాని దినదినం పాలనలో "మనం ఎవరికి ఏ ప్రయో జనం చేకూరిస్తే మనకు మన పార్టీకి రాజకీయ లబ్ధి చేకూరుతుంది" అనేది ప్రధాన అంశమై కూర్చుందిప్పుడు.
ఒక ప్రయోజనం ఇచ్చేటప్పుడది సర్వజనీనంగా ఉండాలి. కాని అదిప్పుడు ఇద్దరు చంద్రులు తమ పార్టీ లేదా ఇంటి వ్యవ హారం చేసేశారు. అఙ్జాతవాసి జై సింహ సినిమా లకు ఎక్కువ ఆటలు నిర్వహించుకోవటమే కాదు టిక్కెట్ వెల వారిష్టం అన్న తరహాగా నడిచింది. ఐతే ఎప్పుడూ చట్టబద్ధతకే ప్రధాన్యమివ్వాల్సిన ప్రభుత్వాలు అనాలోచి తంగా చట్టవిరుద్ధంగా నిర్మించిన సినిమాకు ప్రభుత్వపరంగా ప్రయోజనాలివ్వటం ప్రభుత్వాలను సైతం విమర్శలకు గురిచేయవచ్చు. అసలు కథ యేమంటే:
అజ్ఞాతవాసి సినిమా బృందానికి ఇక్కట్లు తప్పేలా లేవు. ఇప్పటికే అట్టర్ ప్లాప్ టాక్ మూటగట్టుకున్న ఈ సినిమాకి ముండు జరిగిన ప్రచారం తెచ్చిన అనూహ్య హైప్ తో తొలిరోజు వసూళ్ళు బాగానే ఉండడం కాస్త కాస్తంత ఊరట కలిగించింది. ఆ సంతోషం కూడా నిలవకుండా ఈ చిత్రంపై "కాపీ ముద్ర" ధారుణంగా పడిపోయింది. దీనిపై అజ్ఞాతవాసి చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపుతామని ఫ్రెంచ్ దర్శకుడు "జెరోమి సలే" ఇప్పటికే పేర్కొన్నారు.
ఐక్యూ అత్యధికంగా ఉన్న దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఫ్రెంచ్ అట్టర్ ఫ్లాప్ సినిమా "లార్గో విన్చ్" ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారన్న ఆరోపణలు ఉన్నాయి. చివరకు త్రివిక్రం శ్రీనివాస్లో ఉన్న ఐక్యూ కూడా అరువు తెచ్చుకున్నదే నంటూ ఋజువౌతుంది కారణం ఈ ఫ్రెంచ్ సినిమా హక్కులను ఇండియాలో బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ టీ-సిరీస్ తీసుకుందని, "అజ్ఞాతవాసి" నిర్మాతలు టీ-సిరీస్ తో ఆలస్యంగా నైనా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నారని చెపుతూ అజ్ఞాతవాసి బృందం తమ మీద పడ్డ మచ్చను చెరిపేసుకోవటానికి ప్రయత్నించింది.
అమెరికాలో ఈ చిత్రం 500 పైగా థియేటర్లలో విడుదలై దున్నేసింది, ప్రపంచ రికార్డ్ సాధించిందంటూ చెప్పుకొచ్చిన పవన్ అభిమానులను చెప్పుతో కొట్టినట్లు - ఈ చిత్రాన్ని ఫ్రెంచ్ దర్శకుడు జెరోమి సలే వీక్షించి బాగుందని కితాబు ఇస్తూ ఇది దాదాపు తన "లార్గో విన్చ్" లాగే ఉందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తమ చిత్రాన్ని "కాపీ చేసిన విషయం" లో "అజ్ఞాతవాసి" బృందం మౌనం వహిస్తోందని, ఇక ఇప్పుడు తాము సహించలేమంటూ "లీగల్ యాక్షన్" తీసుకుంటున్నామని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
అంతర్జాతీయ చట్టాలు చట్టుబండలు కావు ఆదేసుకుంటాయి అదీ పేటెంట్ రైట్స్ అంటే ఇంతే సంగతులు. అసలే లార్గో వించ్ వైఫల్యంతో మునిగిపోయున్న పంపిణీదారులు అసలే ఊర్కోరని తెలుస్తుంది. ఈ యాంబిట్ నుండి త్రివిక్రం తో పాటు పవన్ నిర్మాత రాధాకృష్ణ బుక్ అవ్వటం తధ్యం.
తన ట్వీట్ కు లీగల్ నోటీస్ అనే హ్యాష్ట్యాగ్ను కూడా ఆయన జత చేశారు. దీనికి సమాధానంగా "అజ్ఞాతవాసి" నిర్మాతలు, టీ-సిరీస్ - పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసుకోవచ్చుగా అని ట్వీట్ చేయగా జెరోమి సలే స్పందిస్తూ అది సాధ్యం కాదన్నారు. టి సీరిస్ కిచ్చిన హక్కులు భారత్కు మాత్రమే నని అదీ బాలీవుడ్ హిందీ వెర్షన్ కు మాత్రమే నన్న అభిప్రాయం వెలిబుచ్చారు.
ఇలా చూస్తే "ఒక ఇల్లీగల్ సినిమాకు లీగల్ ప్రభుత్వాలు" పనిగట్టుకొని సహాయం చేయటం ప్రభుత్వాల ప్రాణికతను దిగజార్చు కోవటమే కదా! అయితే పవన్ కళ్యాణ్ కు ఇదంతా తెలియదనుకోవటం "ఒక భ్రమ" మాత్రమే అంటున్నారు. ఈ కాపీలో ఆయన భాగస్వామ్యం పాలెం తో? రాజకీయంగా తొలి అడుగులు వేసేటప్పుడు నీతులు చెప్పేటప్పుడు ఆయనలోని పాపాల చిట్టా క్రమంగా వెలుగు చూడటం తధ్యమే కదా!
"వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రం నీ జీవితం నీది పబ్లిక్ లోకి వస్తే నీ జీవితం ఒక తెరిచిన పుస్తకం. ప్రతి ఒక్కరూ దాని పై స్పందిస్తారన్న మహకవి శ్రీ...శ్రీ మాటలు మరువరాదు.
ఈ పాపంలో ప్రభుత్వాలు కూడా నైతికంగా భాగస్వాములే. పవన్ కళ్యాణ్ సినిమా పాపం ఇలా తలా పిడికెడైంది.
రాజకీయ యాత్రలు చేసే పవన్ ను చూడవచ్చే జనాలకు ఆయనొక జోకింగ్ స్టాక్ అయ్యాడు. జనాన్ని చూసి రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తే ముఖ్యంగా తెలంగాణం చర్మం వలిచేయ వచ్చంటున్నారు. శాసనసభలో ప్రతిపక్షాలను చంపేసిన ఈ ఉభయ తెలుగు ప్రభుత్వాలకు - సరైన ప్రతిపక్షం కావాలికాని పాపం పంచుకోవటానికి అధికార పార్టీలకు మద్దతు నిచ్చే పవన్ కళ్యాణ్ అవసరం ఉందా అనేదే అసలు ప్రశ్న.