కత్తి మహేష్ ఇప్పుడు ఈ పేరుకు పరిచయం అస్సలు అక్కరు లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతను ఒక సంచలనం అని చెప్పవచ్చు. నిత్యం టీ వి ఛానెల్ కు ఇంటర్వ్యూ లు ఇస్తూ ప్రస్తుతానికి బిజీ బిజీ గా ఉన్నాడు. అతని ప్రోగ్రాం లకూ టీ అర్ పి రేటింగ్స్ బాగానే వస్తున్నాయి కాబట్టి అందరు అన్ని ఛానల్ వాళ్ళు అతని ప్రోగ్రాం ను టెలికాస్ట్ చేయడం కోసం ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం పవన్ ఫ్యాన్సు కు తనకు మద్య ఉన్న వివాదాలకు తెరతీయడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఆ వివాదం ముగుసిన పోయిన, కత్తి మహేష్ కు ప్రజల్లో మంచి పాపులారిటీ మరియు ఫాలోయింగ్ వచ్చిందని చెప్పవచ్చు. ఆ వివాదం తరువాత కూడా ఛానల్ వాళ్ళు అతని కోసం ఎగపడుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. అయితే కత్తి మహేష్ గురించి ఒక ఆసక్తి కరమైన న్యూస్ బయటికి వచ్చింది. జనసేన తరుపున తిరుపతి ఎంపి గా కత్తి మహేష్ కు ఆఫర్ ఇచ్చినారని, అయితే ఇందులో ఎంతో కొంత నిజం ఉండొచ్చని కొన్ని లాజిక్ లు గమనిస్తే అర్ధం అవుతుంది.
తిరుపతి ఎంపి సీట్ యస్సీ కి రిజర్వడు. కత్తి మహేష్ కూడా దళితడు కాబట్టి జనసేన అతనికి ఇవచ్చు మరియు తిరుపతి లో దళితుల తరువాత ఎక్కువగా ఉండేది కాపులే. కాపులు జనసేన కు కంచుకోట లాంటి వారని అందరికి తెల్సిందే . పైగా కత్తి మహేష్ కూడా చిత్తూర్ కు సంభిందించిన వ్యక్తే. ఇక్కడ ప్రాంతీయ తత్వం కూడా పనికివస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి కత్తి మహేష్ కూడా ఎప్పుడు జనసేన లో చేరనని చెప్పలేదు. పార్టీ విధి విధానాలు నచ్చితే పార్టీ లో చేరాతానని చెప్పాడు. ఇప్పడు కత్తి మహేష్ పబ్లిక్ ఫేం కాబట్టి అది కచ్చితంగా పార్టీ కి ఉపయోగపడుతుంది అని జనసేన పార్టీ వారు అంచనా వేస్తున్నారు.