ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ఏపీ ప్రత్యేక హోదా గళం వినిపిస్తుంది.  దీంతొో అధికార పక్షం కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనలు తెలపుతున్నారు.  అధికారపక్షం బీజేపీతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ జట్టు కట్టినా ఎందుకు హామీలు నెరవేరడం లేదు. ఈ విషయాన్నీ తెలిసినప్పటికీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ఇన్నాళ్లూ సమస్యల పరిష్కారంపై ఒత్తిడి చేయడంలో విఫలమైందంటున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు ఎన్నికల ముందు తీవ్రస్థాయిలో కేంద్రాన్ని విమర్శిస్తూ వారు చేసిన తప్పులను కప్పిఉంచడానికి ప్రయత్నిస్తున్నారని వాదిస్తున్నారు.


ఐతే.. విభజన చట్టం అన్ని అంశాలు క్లియర్ గా చెబుతున్నా.. సాయం చేసేందుకు అన్ని అవకాశాలూ ఉన్నా కేంద్రం మాత్రం మొండిచేయి చూపుతుంది. ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్రా, తెలంగాణా విడదీసే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఎన్నో హామీలు ఆ చట్టంలో ఇచ్చారు. ఏపీ రాజధానికి కోల్పోతుంది కాబట్టి అందుకు పరిహారంగా ఏపీకి ఎన్నోవిధాలా సాయపడాలని అందులో పేర్కొన్నారు. అవన్నీ సరిగ్గా అమలు చేస్తే ఏపీకి ఏ ఇబ్బందీ ఉండదు. కానీ నాలుగేళ్లయినా ఆ హామీలు ఎందుకు నెరవేరడం లేదు.. ఎందుకు.. మోడీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు.. ఈ ప్రశ్నలకు ఇప్పుడు బీజేపీ దగ్గర సమాధానం లేదు.


ఐతే.. లోతుగా పరిశీలిస్తే నరేంద్రమోడీ, అమిత్ షాకి సొంత రాష్ట్రం గుజరాత్ పై ఉన్న ప్రేమే ఏపీకి సాయం చేయకుండా అడ్డుపడుతుందేమో అనిపిస్తోంది. ఆంధ్రా అభివృద్ధి చెందితే గుజరాత్ కు పోటీ వస్తుందని ఈ మహా నేతలిద్దరూ భయపడుతున్నారేమో అనిపించకమానదు. అవును మరి.. విభజన కష్టాలు ఓవైపు ఇబ్బందిపెడుతున్నా.. ఏపీ ప్రగతిలో దూసుకుపోతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గుజరాత్ ను ఒక్క తన్నుతన్ని ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. ఇంకా అనేక రంగాల్లో సత్తా చాటుతోంది. బహుశా అందుకే ఈ ఇద్దరు నేతలు చంద్రబాబు అంటే భయపడుతున్నారేమో అనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. చంద్రబాబు అభివృద్ధి చెందితే ప్రధాని పదవికి పోటీ వస్తాడని మోదీ భయం కావచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: