కమ్మ సామాజిక వర్గం.. జనాభాలో తక్కువ శాతం ఉన్నా.. తెలుగు రాష్టాల్లో చాలా బలమైన సామాజిక వర్గం అన్నసంగతి తెలిసిందే. అంతే కాదు.. ప్రత్యేకించి మీడియాలో ఈ సామాజిక వర్గ ఆధిపత్యం ఎక్కువ. రాజకీయాల్లోనూ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ సామాజిక వర్గ ఆధిపత్యం ఎక్కువ. ఐతే.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. ఈ సామాజిక వర్గానికి విశేష ప్రాధాన్యం ఇస్తున్నారని.. రాజకీయ, రాజకీయేత పదవులు, ఇతర అవకాశాలు ఈ సామాజిక వర్గానికే కట్టబెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. 

kamma caste engish daily కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు ఈ విమర్శలపై జాతీయ స్థాయి మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. హెచ్సీయూ వీసీ పదవి మొదలుకొని ముఖ్యమైన జాతీయ సంస్థల్లో తన కులం వారికి చంద్రబాబు పదవులు కట్టబెడుతున్నది బయటపెడుతున్నారని ఆరోపిస్తున్నాయి. చివరకు ఏపీకి వచ్చిన పద్మా అవార్డులు పొందిన వారిలో సైతం 90 శాతం ఒకే కులం వారు ఉండడాన్ని కూడా జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. 

rohith vemula కోసం చిత్ర ఫలితం

హెచ్సీయూలో రోహిల్ ఆత్మహత్య అంశం వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల పత్రిక ఆసక్తికరమైన కథనం ప్రచురించింది. హెచ్సీయూ వీసీ పదవి అప్పారావుకు దక్కడం వెనుక వెంకయ్య హస్తముందని పలువురు అభిప్రాయపుడుతున్నారని కథనం వెల్లడించింది. అప్పారావు కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే. ముఖ్యమైన పదవుల్లో కమ్మ సామాజికవర్గానికి పెద్దపీట వేస్తుండడం స్పష్టంగా అర్థమవుతోందని… దీనిపై రాష్ట్రపతి కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని హరగోపాల్ అభిప్రాయపడినట్టు ఆ పత్రిక వెల్లడించింది.

సంబంధిత చిత్రం
కమ్మ సామాజికవర్గం వారికి పదవులు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో రేసులో ఉన్న సీనియర్ అధికారులను అణచివేస్తున్నారని కంచె ఐలయ్య ఆరోపించారు. వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రి అయిన తర్వాతే ఇలా కమ్మ కులానికి కీలక పదవులు కట్టబెట్టే తంతు మొదలైందని ఆయన మండిపడ్డారు. నేషనల్ అకాడమీ ఫర్ రిసెర్చ్ మేనేజ్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్, సెంట్రల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్తో పాటు పలు అత్యంత కీలకమైన జాతీయ సంస్థలకు అధిపతులుగా కమ్మ సామాజికవర్గం వారినే నియమించడాన్ని జాతీయ మీడియా ప్రముఖంగా హైలైట్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: