నానాటికీ దేశంలో మహిళలకి రక్షణ కరువవుతుంది. మహిళల కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా అవి పోలీసుల లా పుస్తకాలు,న్యాయస్థానాలలోని పుస్తకాల వరకే పరిమితం అవుతున్నాయి. శిక్షలు కఠినంగా లేకపోవడం,శిక్ష పడినా కొన్ని రోజులేకదా జైలుజీవితం అని నేరస్తులు  విహారయాత్రకు వచ్చినట్లు వచ్చి తిరిగి వెళ్తున్నారు. తాజాగ దేశరాజధాని ఢిల్లీలో జరిగిన సంఘటన యావత్ దేశాన్ని మరోమారు తలదించుకునేలా చేసింది. 


వివరాల్లోకెళితే ఢిల్లీ వర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని ఈనెల ఏడవ తేదీన సాయంత్రం కాలేజీ ముగిసాక  ఇంటికి వెళ్ళడానికి ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు లో ఎక్కి కూర్చుంది. కాసేపటికే  పక్క సీట్లోకి ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న కాసేపటికే ఆ అమ్మాయిని వికృతంగా తాకుతూ, అసభ్య సంజ్ఞలు చేశాడు. దీనితో ఆ యువతి అతనికి దూరంగా జరిగి కూర్చుంది. అయినా ఆ ప్రబుద్దుడు ఈ సారి తాను మనిషినన్న విషయం మరచిపోయి ఏకంగా తన మర్మాంగాన్ని ఆమెకు చూపించి  హస్తప్రయోగం చేస్తూ  వికృత చేష్టలకు దిగాడు.


అతడి చేష్టలకు ఖంగుతిన్న యువతి అతన్ని పోలీసులకు పట్టించాలన్న ఉద్దేశంతో ధైర్యంగా ఆ తతంగాన్ని మొత్తం వీడియోలో రికార్డ్ చేసింది. బస్సు దిగాక దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఆ వ్యక్తి తనకు మర్మాంగాన్ని చూపిస్తూ హస్తప్రయోగం చేశాడని , దేహాన్ని తాకి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ వ్యక్తిపై పిర్యాదు చేసింది. అందుకు సాక్ష్యంగా ఆ వీడియోను పోలీసులకు అందించింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు త్వరలొనే విచారణను ప్రారంభించి ఆ కీచకుడిని పట్టుకుంటామని ఆ యువతికి హామీ ఇచ్చారు.కాగా ఆ యువతి తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: