ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ కాంట్రర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే..పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు భీమడోలు మెజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనపై మూడు వేర్వేరు కేసుల్లో మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. గతంలో కూడా చింతమనేని ప్రభాకర్ పై పలు సంచలన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కేసు వివరాల్లోకి వెళితే..2011లో అప్పటి మంత్రి వట్టి వసంత్కుమార్పై చింతమనేని ప్రభాకర్ చేయి చేసుకున్నారు.
అంతేకాదు ఆ వెంటనే ఆయన గన్ మెన్ పై కూడా చేయి చేసుకున్నారు చింతమనేని ప్రభాకర్ చేయి చేసుకున్నారు. వట్టి వసంత్ కుమార్ గన్మెన్పై చేయిచేసుకున్న కేసులో దోషిగా నిర్ణయిస్తూ భీమడోలు మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. ఆ సమయంలో వట్టి వసంత్ కుమార్ మంత్రి హోదాలో ఉన్నారు. అయితే వసంత్ కుమార్ గన్మెన్ ఫిర్యాదు మేరకు దెందులూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు నాలుగు సెక్షన్లగా కేసు నమోదు చేశారు.
ఏడేళ్లగా కేసు వాదోపవాదనలు జరగగా నేడు (బుధవారం) కోర్టు తీర్పు వెలువరించింది. ఇక సెక్షన్ 506(2) గా రెండేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయిల జరిమానా....సెక్షన్ 353 గా ఆరు నెలల జైలు శిక్ష, వేయి రూపాయిల జరిమానా, సెక్షన్ 7(1) గా ఆరు నెలలు జైలు శిక్ష తో పాటు 500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. మొత్తంగా మూడేళ్ల జైలు శిక్ష, 2500 జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ సంచలన తీర్పు వెల్లడించారు. తీర్పు వెలువడిన వెంటనే చింతమనేని బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది.