జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలలో దిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తాస్తున్నారు. అయితే మొదటి నుండి పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగులు గమనిస్తే వైఎస్ జగన్ ని టార్గెట్ చేస్తూ ముందుకు సాగడం మనకందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో జతకట్టి వైఎస్ఆర్ సీపీ పార్టీ మీద పార్టీ అధినేత జగన్ మీద అనేకసార్లు విమర్శించటం జరిగింది.


అయితే తాజాగా రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారడం రాష్ట్ర ప్రజలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడడం తో పవన్ కల్యాణ్ తన రూటు మార్చడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని పవన్ “జేఎఫ్‌సీ” కమిటీ వేసి రాజకీయాలలో రాణించాలని అనుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా విపక్షనేత వైసిపి అధినేత జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.


ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ రచయిత నటుడు జగన్ అభిమాని రంగంలోకి దింపాలని జగన్ ఆలోచిస్తున్నట్లు ఉన్నారు. ఆయన మరెవరో కాదు పోసాని కృష్ణ మురళి. ఈసారి రాజకీయంగా పవన్ పై విమర్శలు చేయించడానికి పోసాని కృష్ణ మురళి ని పవన్ పై ప్రయోగించాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం.


గతంలో కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ కి చేసిన డామేజ్ అంతా ఇంతా కాదు...పోసాని మాత్రం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తే మాత్రం కత్తి మహేష్ పోగొట్టిన ఇమేజ్ కంటే కూడా మరింత ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఏదిఏమైనా ముల్లుని ముల్లుతోనే తీసినట్లు జగన్ నటుడికి తోటి నటుడు తోనే చెక్ పేడుతున్నట్లు ఉంది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పోసాని ఎప్పుడైనా పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు వైసీపీ వర్గంవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: