జగన్ తన వేసే ఎత్తుగడలతో టీడిపి ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. తన స్పీడ్ ను ఇంకా పెంచాడు అని చెప్పవచ్చు. ఇప్ప‌టికే ప‌లు రూపాల్లో ఆందోళ‌న చేసిన పార్టీ తాజాగా గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు కార్యాచ‌ర‌ణ‌కు ఒక‌దాని వెంట మ‌రొక‌టి అన్న‌ట్లుగా చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు పార్టీ నేత‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి త‌మ కార్యాచ‌ర‌ణ‌ను డిసైడ్ చేశారు.
Image result for jagan and chandrababu
పాద‌యాత్ర‌లో ఉన్న వైఎస్ జ‌గ‌న్ సోమ‌వారం పార్టీ నేత‌ల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ పిలుపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ లు నిర్వహించటం జరిగింది  ప్రత్యేక హోదా మాత్రమే సంజీవని ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోంది.
Image result for jagan and chandrababu
మార్చి 1న అన్ని కలెక్టరేట్ల ముందు పార్టీ కార్యకర్తలు, సమన్వయకర్తలు అందరూ కలిసి ధర్నా చేయాలని నిర్ణయం. మార్చి 3న పార్టీ నేతలు అందరూ వైఎస్ జగన్‌ను కలుస్తాం. మార్చి 3న పార్టీ కీలక నేతలందరూ ఢిల్లీ వెళ్లటానికి వైఎస్ జగన్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మార్చి 5న `ప్రత్యేక హోదా మన హక్కు. ప్యాకేజీ మాకొద్దు`..అంటూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో ధర్నా.


మరింత సమాచారం తెలుసుకోండి: