కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ వివాదం రాష్ట్రంలో అప్పట్లో  పెన్ను  సంచలనాలు సృష్టించాయి. ఏ చానల్ పెట్టినా ఎక్కడని న్యూస్ విన్న వీరిద్దరి గురించే చర్చ జరిగేది అయితే గొడవ ముదురుతున్న నేపథ్యంలో రెండు వర్గాల వారు రాజీపడి సైలెంట్ అయిపోవడం జరిగింది. తర్వాత కొన్ని కొన్నిసార్లు  కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మీద ట్విట్లు చేసిన పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఏమీ లేవు.


అయితే తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి  ఇప్పటి దాకా వచ్చిన నిధుల విషయమై ఏర్పాటు చేసిన ‘జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటి’ మిద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్న సభ్యులంతా దొంగలు అని సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు.


ఈ సందర్భంగా కత్తి మహేష్ పేర్లు చెప్పకుండా వారి చేసిన దొంగ పనులను చెబుతూ తనదైన శైలిలో పవన్ ఏర్పాటు చేసిన కమిటీని  విమర్శించారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా సమయంలో భారి కుంభకోణం అయినా ఫోక్స్ వ్యాగన్ కార్ల పాత్రధారి, అంతేకాకుండా ఈ కమిటీలో ఉన్న ఐఏఎస్ ఐఆర్ఎస్ అధికారులు అంతా వివిధ కుంభకోణాల్లో ఉన్నవారేనన్నారు.


మరికొందరైతే రాష్ట్ర వనరులను తాకట్టుపెట్టి రిలయన్సు కంపెనీకి లాభం చేకూర్చిన వారే ఈ  కమిటీలో ఉన్నారంటూ కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మీద ధ్వజమెత్తారు. ఇటువంటి రాష్ట్ర దొంగలను కమిటీలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ నాటకాలు ఆడుతున్నారని కత్తి మహేష్ అన్నారు. అంతేకాకుండా ఇంకా చాలా మంది ప్రజలను మోసం చేసిన ప్రొఫెషనల్ మోసగాళ్లే ఈ కమిటీ సభ్యులు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు కత్తి మహేష్.



మరింత సమాచారం తెలుసుకోండి: