వైసిపి అధినేత ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్ చేస్తున్న పాదయాత్ర కి జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలలో తాజా రాజకీయ పరిణామాల మధ్య వైసీపీ పార్టీ బిజెపి పార్టీ తో జాత కడుతుందన్న నేపథ్యంలో వైసిపి పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడటానికి రెడీగా వున్నారని అంటున్నారు కొంతమంది.


తాజాగా ఈ పొత్తుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. వైకాపా కనుకా బీజేపి తో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే విషయం పక్కన పెడితే వైసీపి ని మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం వీడటానికి సిద్దంగా ఉన్నారని..వైసిపీ మొత్తానికి ఖాళీ అయ్యే సూచనలు మాత్రం ఉంటాయని తెలుస్తోంది.


అంతేకాకుండా వివిధ జిల్లాలకు చెందిన నాయకులు కూడా బిజెపితో పొత్తు పెట్టుకుంటే వైసిపి వీడతానని వైయస్ఆర్సిపి అధిష్టానం పెద్దలకు డెడ్ లైన్ విధించడం జరిగింది.


అయితే వీరందరూ కూడా బీజేపీతో జగన్ ఎప్పుడు పొత్తు పెట్టుకుంటే అప్పుడు టిడిపిలోకి జంప్ అవ్వడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే పార్టీ వీడే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో మైనార్టీల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: