ఈ మద్య భార్య భర్తల అనుబంధానికి తీరని మచ్చ తెస్తున్నారు కొంత మంది మహిళలు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను దారుణంగా చంపిన ఘటనలు వరుసగా వెలుగులోకి వచ్చాయి.  పెళ్లై పిల్లలు ఉన్న ప్రియుడి మోజులు కట్టుకున్న భర్తలను ప్లాన్ వేసి మరీ చంపుతున్నారు. ఈ మద్య నల్లగొండ జిల్లాలోని ఉప సర్పంచ్ ధర్మానాయక్ హత్య కేసులో మిస్టరీ వీడింది.  నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని కృష్ణపట్టి ప్రాంతానికి చెందిన నాగార్జున పేట తండాల్లో ఈ నెల 13వ తేదీన కాంగ్రెసు నేత, ఉప సర్పంచ్ హత్య జరిగిన విషయం తెలిసిందే.
Image result for nalgonda dharmanaik murder
ధర్మా నాయక్ హత్య కేసులో ఆయన చిన్న భార్య శిరీషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసింది.  గత కొంత కాలంగా శిరీషకు అదే గ్రామంలో ఉన్న అంగోతు రవితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తుంది. గత సంవత్సరం వారు ఇంట్లోంచి పారిపోయారు...తిరిగి పెద్దలు వారిని బెదిరించి తీసుకు వచ్చారు.  అయితే, గ్రామ పెద్దల పంచాయతీ మేరకు ఆమె కొంత కాలంగా భర్తతో కలిసి ఉంటోంది. అయితే, మళ్లీ రవితో చనువుగా ఉంటున్నట్లు గమనించి ధర్మా నాయక్ శిరీషను హెచ్చరించాడు.
Image result for nalgonda dharmanaik murder
తమ అక్రమ సంబంధానికి భర్త పదే పదే అడ్డు వస్తున్నాడని భావించిన శిరీష తన ప్రియుడితో కలిసి ఎలాంగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. రవి ఈ నెల 9వ తేదీన గ్రామ సమీపంలోని నాయకుని తండాలో చేపల వేటకు బాంబులు అమ్మే మెగావత్ హతీరాం నుంచి బాంబును కొని తన చిన్నమ్మ ద్వారా ప్రేయసి శిరీషకు పంపించాడు. తర్వాత పక్కా ప్లాన్ తో ధర్మానాయక్ మంచం కింద బాంబ్ అమర్చి హతమార్చారు. ఈ కేసులో శిరీషను, రవిని, వారికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: