ఈనెల ఏడవ తేదీన ఢిల్లీ వర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని బస్సు లో  ఇంటికి వెళ్తుండగా ఒక మధ్యవయస్కుడు ఆమెను లైంగికంగా వేధిస్తూ ఆమె కళ్ళముందే హస్తప్రయోగం చేసిన విషయం తెలిసిందే. గత వారం ఈ వార్త పెను సంచలనాన్ని సృష్టించింది. కాగా ఆ ప్రబుద్ధుడిని పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు 25 వేల రివార్డు ప్రకటించారు.


వివరాల్లోకెళితే ఢిల్లీ వర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని ఈనెల ఏడవ తేదీన  బుధవారం సాయంత్రం కాలేజీ ముగిసాక  ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు లో ఇంటికి వెళ్తుంటే కాసేపటికే ఒక వ్యక్తి ఆమె పక్కన వచ్చి కూర్చొని ఆ అమ్మాయిని వికృతంగా తాకుతూ, తన మర్మాంగాన్ని ఆమెకు చూపించి హస్తప్రయోగం చేస్తూ వికృత చేష్టలకు దిగాడు. దీంతో ఖంగుతిన్న యువతి ఆ తతంగాన్ని మొత్తం వీడియోలో రికార్డ్ చేసింది.


బస్సు దిగాక నేరుగా పోలీసుస్టేషన్ వెళ్లి అతని మీద ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు త్వరలొనే విచారణను ప్రారంభించి ఆ కీచకుడిని పట్టుకుంటామని ఆ యువతికి హామీ ఇచ్చారు. ఇంకా ఎన్నాళ్లయినా నిందితుడిని పట్టుకోలేకపోవడంతో ప్రతిపక్షాలు, ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తునాయి. ప్రభుత్వం కూడా ఒత్తిడి పెంచేస్తుండడంతో చేసేదేమీలేక నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 25 వేల రివార్డు ఇస్తామని ప్రకటించారు. మరి ఎవరైనా ఆ డబ్బుకు ఆశపడి పట్టిస్తారో లేదో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: