జగన్ ఎప్పుడైతే రాజీనామా వ్యూహం సంధించాడో, అప్పటి నుంచి ఒక్క సారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయిందని చెప్పవచ్చు. మరో ఒక ఏడాది లో జనరల్ ఎలక్షన్స్ ఉండటంతో అన్ని పార్టీ లు అధికారమే లక్ష్యంగా ముందుకు సాగిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలి ఉన్నందున ప్రత్యేకహోదా ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు,ఓట్ల రూపంలో క్యాష్ చేసుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.
గడిచిన నాలుగేళ్లు ఒక ఎత్తు అయితే,మిగిలున్న ఏడాది మరో ఎత్తు కాబట్టి ప్రత్యేక హోదాకు రాజకీయ రంగును అద్ది ముద్ద చేయనున్నాయి. .ఏఫ్రిల్ 6లోపు ప్రత్యేకహోదాపై కేంద్రం దిగిరాకపోతే తమ పార్టీ ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు. ఇక,జగన్ డెడ్ లైన్ కు ముందే కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు.అందుకే,మార్చి 5లోపు ఏదో ఒకటి తేల్చకపోతే కేంద్రంలో మంత్రులుగా ఉన్న తమ పార్టీ ఎంపీలు బయటికొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
మార్చి 5 నుంచి కేంద్రంతో తెగతెంపుల ప్రక్రియకు గుడ్ బై చెప్పేలా దశలవారిగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. జగన్ డెడ్ లైన్ ను ఏప్రిల్ 6 గా ప్రకటిస్తే,చంద్రబాబు మాత్రం మార్చి 5 లోపే ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది.మార్చి 5 తర్వాత టీడీపీ కేంద్రమంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉంది.తదనంతరం పార్టీ ఎంపీలు కూడా రాజీనామా బాటపట్టనున్నట్లు సమాచారం.ఇక అయినా కేంద్రం తలొగ్గకపోతే,ఎన్డీయే నుంచి వైదొలిగేలా చంద్రబాబు కార్యాచరణను ప్రకటించనున్నారు. ఏది ఏమైనా అప్పటికి జగన్ వల్లే చంద్ర బాబు నాయుడు రాజీనామా గురించి మాట్లాడినాడని జనాలు అనుకుంటున్నారు.