తెలుగుదేశంలో హీరో ఎవరను కుంటున్నారా.. లేక నందమూరి బాలకృష్ణను బీజేపీ ఎందుకు టార్గెట్ చేసిందా అని ఆలోచిస్తున్నారా.. ఇక్కడ హీరో అంటే నిజమైన హీరో కాదు.. మొన్న పార్లమెంటులో మోడీని, జైట్లీని నిలదీసిన హీరో అని అర్థం.. అదే గల్లా జయదేవ్ అండీ.. ఆయన్ని బాగా పోరాడావంటూ టీడీపీ సన్మానాలు గట్రా చేసింది కదా.. అందుకే ఆయన హీరో అయ్యాడు. 

galla jayadev SPEECH కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు ఆ హీరోను బీజేపీ టార్గెట్ చేసింది. విజయవాడలో సమావేశమైన బీజేపీ కార్యవర్గం టీడీపీ నేతల దాడికి ఎదురుదాడి చేసేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ కు చేసిన సాయం, విభజనహామీల అమలు విషయంలో ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు రెడీఅయ్యింది. టీడీపీ ప్రచారంతో తీవ్రంగా నష్టపోయామని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఇకపై దాడిని తిప్పికొట్టాలని తీర్మానించారు. 

BJP ANDHRA MEETING కోసం చిత్ర ఫలితం
మిత్రపక్షంగా ఉంటూ ప్రధాని మోదీని మిస్టర్ అని సంబోధించటం,  కేంద్రబడ్జెట్ పై విమర్శలు చేయటం, దిష్టిబొమ్మలు తగులబెట్టడాన్ని బిజెపి నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని భేటి ముగిశాక బిజెపి నేత విష్ణుకుమార్ రాజు ప్రకటించారు. ప్రధాని మోదీని మిస్టర్ ప్రైం మినిస్టర్ అంటూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడిన తీరుని ఆక్షేపించారు. 

vishnu kumar raju కోసం చిత్ర ఫలితం
చంద్రబాబుని మిస్టర్ చీఫ్ అనే కుసంస్కారం తమకు లేదన్నారు. హరిబాబుని జంటిల్మన్ కాదని ఓ మంత్రి వ్యాఖ్యానించటాన్ని కూడా సమావేశంలో తప్పుబట్టారు. బిజెపికి పదవులు త్రుణ ప్రాయమని చెప్పిన విష్ణుకుమార్ రాజు... అవసరం లేకున్నా ఇతర పార్టీల నేతల్ని చేర్చుకుంటున్నారని టీడీపీను పరోక్షంగా విమర్శించారు. అంటే ఇక టీడీపీ- బీజేపీ నేతల మాటలయుద్ధం మరింత ముదరబోతోందన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: