ఈ మద్య డబ్బు కోసం కొంత మంది అడ్డదారులు ఎంచుకుంటున్నారు. కష్టపడి పనిచేస్తే..అనుకున్న స్థాయికి చేరుకోవడం కష్టమని..అడ్డదారుల్లో వెళితే ఈజీగా డబ్బు సంపాదించవొచ్చని చట్ట వ్యతిరేక పనులు చేస్తూ ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా కొంత మంది దళారులు మహిళలు, యువతులతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ..లక్షలు గడిస్తున్నారు. గ్రామాల నుంచి ఉద్యోగాలు చేయాలని వచ్చిన కొంత మంది యువతులను లొబర్చుకోవడం..చదువు కోసం వచ్చి లగ్జరీగా బతకాలని చూసే అమ్మాయిలను వలలో వేసుకోవడం..భర్తలను కోల్పోయి గత్యంతరం లేక వ్యభిచారం చేసే వారిని చేరదీయడం వారితో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.
వీరికి కొంత మంది పోలీసులు, రాజకీయ నాయకుల అండదండ ఉండటంతో వారు ఆడిందే ఆట..పాడిందే పాట అవుతుంది. అప్పుడప్పుడు మీడియాలో మాత్రం ఇలాంటి వ్యభిచార దందాలు నిర్వహించే వారిపై పోలీసులు దాడి చేసి అరెస్టు చేస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వేర్వేరు ముఠాలను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ ఖానామెట్లోని క్యాజిల్ అపార్ట్మెంట్పై పోలీసులు దాడి చేశారు.అపార్ట్మెంట్ లోని ఫ్లాట్నెంబర్-503లో నాగేంద్రబాబు, జానయ్య అనే ఇద్దరు వ్యక్తులు వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.
ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషనుకు తరలించారు.అదే అపార్ట్మెంట్లో మరో ఫ్లాట్లో విజయ్ భాస్కర్ అనే వ్యక్తి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వ్యభిచారం చేస్తున్న చాయచౌహాన్(23), జరీనకౌసర్, మౌనికజా అనే ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు విజయభాస్కర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు చెప్పారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్-9లో వ్యభిచారం నిర్వహిస్తున్న మరో ఇంటిపై కూడా పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుల చెర నుంచి ఇద్దరు యువతులకు విముక్తి కల్పించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చాలని ప్రభుత్వం ఓ వైపు ఆలోచిస్తుంటే..మరోవైపు నేర సామ్రాజ్యం కూడా విస్తరిస్తుంది. ఇప్పటికే డ్రగ్స్, గన్ కల్చర్, భూ కబ్జాలతో పాటు హైటెక్ వ్యభిచారాలు కూడా పెరిగిపోయాయి.