వైసిపి ఎంపి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినాడు. కొందరి నేమ్స్ చ్జెప్పి వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నరాని జగన్ ముఖ్యమంత్రి కాగానే వీరు లెక్క తేలుస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పటికే రూపొందించిన ఒక లిస్టు ప్రకారం వారి భరతం పడతామని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిగా ‘జగన్’ ప్రమాణస్వీకారం చేసిన అరగంట లోపలే వారి అంతు చూస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే విజయ సాయి రెడ్డి సిఎంఒ ఇన్ఛార్జి సతీష్చంద్ర ను టార్గెట్ చేశారు. అదే సమయంలో ఇంటిలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వర రావు అంతు చూస్తామని కూడా బెదిరించారు. అయితే ఈ ఇద్దరికీ మరొక ముగ్గురి పేర్లు యాడ్ చేసారు.
గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, తెదేపా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కళా వెంకటరావు, ఎంపి టీజీ వెంకటేష్ లు కొత్త గా వచ్చిన లిస్టులో ఉన్నారని ప్రకటించారు. తాము ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నామని, అయితే తమను వీరంతా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వీరి సంగతి తేల్చుస్తామని ఆయన మీడియా సాక్షిగా హెచ్చరించారు. అయితే ప్రజలు మాత్రం విజయ్ సాయి రెడ్డి మీద భారిగా విమర్శల చేస్తున్నారు. అధికారం రాగానే వాళ్ళ అంటూ చూస్తామని ఇలాంటి అరాచకమైన ప్రకటనలు చేస్తుంటే అధికారం లోకి ఎలా వస్తారో ఆ దేవుడికే తెలియాలి అంటూ అందరు అనుకుంటున్నారు.