అవును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ వల్ల టీడీపికి భారీ నష్టం వాటిల్ల బోతుందట..ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా..! విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన మహా కామేశ్వర పీఠం అధిపతి యద్ధనపూడి అయ్యన్న పంతులు.  ఆయన చేసిన వాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాజకీయ పరిణామాలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Image result for jenasena
తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితి గురించి ఆయన వివరిస్తూ.. ఈ రెండు రాష్ట్రాలకూ కాలసర్పదోషం ఉంది అని వ్యాఖ్యానించారు. సినిమా హీరోలు కొత్త పార్టీలు పెట్టి రాజకీయాల్లోకి వచ్చినా, రాజకీయంగా యాక్టివ్ అయినా.. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీల నుంచి పీఠం చేజారుతుందని ఈ పంతులుగారు చెప్పారు. అయితే సినిమా హీరోలు రాజకీయాల్లోకి వస్తే..జనబలం ఉంటుంది..సినీ నటులు రాజకీయాల్లో క్రియాశీలకం కావడం వల్ల అధికార పార్టీలకే నష్టం అని ఆయన అన్నారు.
Image result for tdp
సినీ హీరోలు రాజకీయాల్లోకి వచ్చి తాము సాధించుకునేది ఏమీ లేకపోయినా.. అధికార పార్టీలకు నష్టం చేస్తారని, మరొక పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు అయ్యన్నపంతులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడు రాష్ట్రంలో సినీ హీరోలు రాజకీయ రంగ ప్రవేశం చేసినా..చేస్తున్న సంగతి తెలిసిందే. 
Image result for telangana
ఇప్పటికే..తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాన్, తమిళనాడు రాజకీయాల్లోకి సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ లు ఎంట్రీ ఇచ్చారు.  ఈ లెక్కన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న పవన్ కల్యాణ్ వల్ల తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితిలకు నష్టం ఉంటుందని.. ఈ జ్యోతిష్కుడు పరోక్షంగా చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: