ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వైయస్ కుటుంబానికి పరిటాల కుటుంబానికి ముందు నుండి వైరం ఉంది అని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో వారి వారసులైన జగన్ పరిటాల శ్రీరామ్ వ్యక్తిత్వాలు గమనిస్తే చాలా వ్యత్యాసం కనబడుతోంది. ఈ విషయంలో జగన్ కంటే పరిటాల శ్రీరామ్ మెరుగైన మనిషి గా కనపడతాడు. ఇటీవల తెలుగుదేశం సీనియర్ నాయకుడు పరిటాల శ్రీరామ్ గాలి ముద్దు కృష్ణమ నాయుడు స్వగ్రామానికి వెళ్లిన సమయంలో అక్కడ జరిగిన ఓ ఆసక్తికరమైన విషయం జరిగిందట.


ఒక స్థానిక నాయకుడు పరిటాల శ్రీరామ్ ని కలిసి తన ఊరిలోని ఒక వ్యక్తికీ వైద్యానికి సహాయం కావాలని, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చే ఏర్పాటు చెయ్యమని కోరారట. అయితే త్వరలోనే ఆ ఏర్పాటు చేస్తా అని అక్కడే శ్రీరామ్ హామీ ఇచ్చారట. అంతేకాకుండా పశ్చిమగోదావరి జిల్లా కి చెందిన మహబూబ్ అనే టిడిపి కార్యకర్తకి అంతుచిక్కని వ్యాధి వచ్చిందని తెలిసి తానే ఆ వ్యక్తి దగ్గరకి వెళ్లి చికిత్స కోసం ఇరవై లక్షలు రూపాయిల సహాయం చేశారు పరిటాల శ్రీరామ్.


మరి అదే విధంగా జగన్ విషయానికొస్తే ఇటీవల జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర అంటూ రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్రలో మొదటి రోజునుండే అనంతపురం జిల్లాకు చెందిన జగన్ అభిమాని రంగారెడ్డి  జగన్ తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. నెల్లూరు వచ్చేసరికల్లా స్పృహ తప్పి పడిపోయారు.


అయితే ఆ సమయంలో ఆయన్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలని అనుకున్నారు కానీ ఈలోగానే ప్రాణాలు విడిచారు. జగన్ ఓ నాయకుడిగా తన అభిమానికోసం ఏమి చేయాలి..వెళ్లి చూసి రావాలా?..కానీ జగన్ అలా అనలేదు, అలా కాకుండా ఆ డెడ్ బాడి నా దగ్గరకి తీసుకుని రండి అన్నాడు. దీంతో జగన్ చేసిన వ్యాఖ్యలకు జగన్ అభిమానులు ఎంతో బాధపడ్డారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: