ఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన అన్యాయం ఫై ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని ఆంధ్ర బీజేపీ నాయకులు టార్గెట్ చేస్తున్నారు. నిన్న ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో జరిగిన డిబేట్ లో హీరో శివాజీ నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా నినాదాలు చేసాడని ఆయనపై విరుచుకుపడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ కు విభజన చట్టం లో ఇచ్చిన అన్ని హామీలు కచ్చితంగా నెరవేర్చాలని ఢిల్లీ తో ఢీ ఆంధ్ర రెడీ అనే కార్యక్రమం కోసం విజయనగరం జిల్లాలో బసచేసిన మహాన్యూస్ ఛానల్ సిబ్బందిపై కొంతమంది దుండగులు దాడి చేశారు.
Related image
ఈ దాడిలో ఆ ఛానల్ కు సంబంధించిన డీసీఎం వ్యాన్, కార్లపై దాడి చెయ్యడం తో అవి ధ్వంసం అయ్యాయి. ఈ దాడిని ఖండిస్తూ జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఈ రోజు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. 'మహాన్యూస్ చర్చ కార్యక్రమం నిర్వహిస్తోన్న సీఈవో మూర్తి, సిబ్బందిపై దాడికి ప్రయత్నించడాన్ని జనసేన పార్టీ ఖండిస్తోంది.
Image result for ap special status
మహా న్యూస్ వాహనాలను ధ్వంసం చేయడం అప్రజాస్వామికం. విజయనగరంలో జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదని, మీడియా స్వేచ్ఛను ప్రతి ఒక్కరు కాపాడాలని జనసేన విజ్ఞప్తి చేస్తోంది' అని పవన్ పేర్కొన్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: