ప్రపంచంలో జరిగే కొన్ని వింతలు చూస్తుంటే..నిజంగా ఇది సాద్యమేనా అని అనిపిస్తుంది. ప్రకృతికి భిన్నంగా కొన్ని జరిగే పరిణామాలు చూస్తే..ఆశ్చర్యం కలగక మానదు. సాధారణంగా సర్పజాతికి చెందినవి..పక్షులు గుడ్లు పెట్టడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో ఓ బాలుడు గుడ్లు పెడుతున్నారు. ఇది వినడానికి వింతగా ఉన్నా..నమ్మడానికి అసాద్యమైనా..కొన్ని నిజాలు వింటుంటే.. ఆధారాలు చూశాక నమ్మక తప్పదు. అక్మల్ అనే యువకుడు ఇండోనేషియా దేశం గోవ ప్రాంతంలో ఉంటున్నాడు.. ఈ బాలుడికి 14 సంవత్సరాలు వయస్సు.. గత రెండు మూడు సంవత్సరాల నుండి గుడ్లు పెడుతున్నాడు.
ఈ చోద్యం ఆ నోటా..ఈ నోటా అందరికీ తెలిసిపోవడంతో ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు మొత్తం 20 గుడ్లు పెట్టాడని అతని తండ్రి స్వయంగా చెప్పాడు. ఈ చోద్యం చూడటానికి జనాలు ఎగబడ్డారు...అయితే ఇది ఏదైనా అనారోగ్యం కారణంగా అయ్యిందా..లేక ఆ కుర్రాడు గుడ్లు ఏమైనా మింగాడా అని అనుమానం వచ్చి..ఆసుపత్రిలో చూపిస్తే డాక్టర్లు కూడా గుడ్లు తేలేశారు.. అక్మల్కు అన్ని పరీక్షలు నిర్వహించినా, అసలు విషయాన్ని మాత్రం కనిపెట్టలేక చేతులెత్తేశారు.
అక్మల్ శరీరం మొత్తం స్కానింగ్ చేస్తున్నారు.. ఈ బాలుడు గుడ్లు మింగిఉంటాడని డాక్టర్లు వాదిస్తున్నారు. కానీ అతని తండ్రి మాత్రం ఒక్క గుడ్డు కూడా ఇప్పటివరకు మింగలేదని చెప్తున్నారు. మొత్తానికి ఈ వార్త అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయ్యింది. మరోవైపు డాక్లరు బాలున్ని పూర్తిగా పరిశీలించి, టెస్ట్ లు చేసి చెప్తామని డాక్టర్లు తెలిపారు.