జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద మరోసారి విరుచుకుపడ్డాడు కత్తి మహేష్. ఇటీవల ప్రముఖ మీడియా సంస్థ ప్రత్యేక హోదా అంశం గురించి 'ఢిల్లీ తో ఢీ ఆంధ్రా రెడీ' అనే కార్యక్రమం చేపట్టిన సదరు మీడియా సంస్థ సీఈఓ పై దాడి చేసి తీవ్రంగా గాయపరచటం జరిగింది. ఈ సందర్భంగా జనసేన అధినేత స్పందించి దాడిని ఖండించడం జరిగింది.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఇంకా స్పందిస్తూ సదరు మీడియా సీఈఓ పై జరిగిన దాడి అప్రజాస్వామికం అని అన్నారు...అంతేకాకుండా మీడియా స్వేచ్చని కాపాడాలని కోరారు పవన్ కళ్యాణ్.
ఈ క్రమంలో ఈ దాడి చేసిన వారెవరో ఇప్పటి వరకు తెలియలేదు. అయితే ఈ క్రమంలో కత్తి మహేష్ స్పందిస్తూ నటుడు శివాజీ మీద దాడిని ఖండించావు. మహా న్యూస్ మీద జరిగిన దాడిని ఖండించావు..అప్రజాస్వామికం అన్నావు.
బాగుంది….మరి నా మీద ని అభిమానులు చేసిన దాడి గురించి ఎందుకు స్పందించవు అని ప్రశ్నించారు... మీడియా సంస్థ పై దాడి వెనుక అధికారపక్షం వుందని ఆరోపించారు కత్తి మహేష్. ఈ సందర్భంగా కత్తి మహేష్ మాట్లాడుతూ ...ఈ నాటకాలన్నీ చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ని కలిసి చేస్తున్నారని అన్నారు కత్తి మహేష్. అంతేకాదు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ నిర్వహించే ప్రతి కార్యక్రమం వెనుక తెలుగుదేశం కష్టం ఉందని అన్నారు కత్తి మహేష్