నేను నిప్పులా బతికాను.. నిప్పులా రాజకీయాలు చేశాను.. నీతికి నిజాయితీకి మారుపేరు అంటూ చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు సర్కారులో అవినీతిని ఆయన సొంతమంత్రే బయటపెట్టడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు. 

CHANDRABABU ADINARAYANA REDDY కోసం చిత్ర ఫలితం
చంద్రబాబు పోటీ మీడియా సాక్షి పుణ్యమా అని ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో ప్రకారం.. చంద్రబాబు అవినీతి చేసుకోవాలని.. ఆ సొమ్ములో పక్క నేతలకూ వాటాలు ఇవ్వాలని చెప్పినట్టు మంత్రి చెప్పడం ఆసక్తి రేపుతోంది. అవినీతి చేసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు చెప్పారని మంత్రి ఆది నారాయణ రెడ్డి ఆ వీడియో  తెలిపారు. 

సంబంధిత చిత్రం
పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. మరో టీడీపీ నేతకు అవినీతిలో వాటాలు ఇవ్వాలని కూడా చంద్రబాబు చెప్పారని వెల్లడించడం హైలెట్ గా నిలుస్తుంది.. తాను చేసే అవినీతిలో టీడీపీ నేత, మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డికి కూడా అర్ధ రూపాయి భాగం ఉందని ఆదినారాయణరెడ్డి చెప్పడం విశేషం. 

సంబంధిత చిత్రం
స్వయానా సీఎం చంద్రబాబు నాయుడే ఐఏఎస్ ఆఫీసర్లని తమతో పాటూ కూర్చోబెట్టి పంచాయతీ చేపించారని మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. రామ సుబ్బారెడ్డి అడిగిన దాంట్లో మనకు సగం వస్తుంది, మనం అడిగినా రామ సుబ్బారెడ్డికి సగం వస్తుంది అంటూ ఆదినారాయణ రెడ్డి తన కార్యకర్తలను హితబోధ చేశారు. 'వాళ్లు దాంట్లో ఏది విమర్శించినా నేనైతే పట్టించుకోను, మీరెవరూ దయ చేసి విమర్శించమాకండి. మీకు కావాల్సిన పనులు నన్ను అడగండి. ఎస్ఎంఎస్ లు పెట్టండి. నీను మీ ఎమ్మెల్యేని, పక్కకు పోయినప్పుడే మంత్రిని' అంటూ ఆది నారాయణ రెడ్డి ఆ వీడియోలో చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: