రాష్ట్ర విభజనకు గురై తీవ్ర నష్టాలను కష్టాలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆడకొంటుంది. అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆడుకుంటున్న బీజేపీ పార్టీని సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. కార్టూన్లు, ఇమేజ్లలో తమ క్రియేటివిటీని జోడించి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నరు బిజెపి పరువు మొత్తం తీసేస్తున్నారు ఫోటోలతో.
ప్రత్యేక హోదా కావాలని, రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలని అన్ని వర్గాలూ ఆందోళనకు దిగుతుంటే…బీజేపీ కొత్త కొత్త వాదనలతో ఉద్యమాలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తోంది. కమలనాథుల కుయుక్తులను పసిగట్టిన ఏపీ ప్రజలు ఘాటుగానే రియాక్ట్ అవ్వుతున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా నినాదం రాష్ట్ర ప్రజలలో బలంగా ఉండటంతో బిజెపి పార్టీ రాయలసీమ డిక్లరేషన్ పేరుతో సరికొత్త ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టే పనిలో పడ్డారు. ఇదంతా గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీని అసహ్యించుకుంటున్నారు.
మరి అదే విధంగా బిజెపి ని సోషల్ మీడియాలో ఏపీపై ఎన్డీఏ కక్షసాధింపు చర్యల్ని తమ పోస్టులు, ఇమేజ్లు, కార్టూన్ల ద్వారా ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో బిజెపి పార్టీ ఉండకుండా పోస్ట్లు కామెంట్లు పెట్టి ఉద్యమం తీసుకురావడానికి సిద్ధపడుతున్నారు. ఈసారి జాతీయ పార్టీలతో మోసపోవద్దు అంటున్నారు సీనియర్ రాష్ట్ర రాజకీయ నాయకులు.