శ్రీదేవి.. దేశం గర్వించే నటి.. ఆదివారం ఉదయం లేస్తూనే భారత దేశం ఆమె మరణవార్త విని నివ్వెరపోయింది. అయ్యో అలా ఎలా జరిగింది అనుకోని సగటు భారతీయుడు ఉండడేమో.. ఎందుకంటే ఆమెలా దేశం మొత్తం తెలిసిన మరో నటీమణి లేకపోవచ్చు. దక్షిణాది, ఉత్తారాది రెండు ప్రాంతాల్లోనూ పేరు తెచ్చుకున్న నటీమణి ఆమె. ఆమె మరణవార్త దావానలంలా వ్యాపించింది. 

sridevi dead body కోసం చిత్ర ఫలితం
ఆమె దేశం కానిదేశంలో దుబాయ్ లోమరణించిందన్న సంగతి తెలిసిందే. కానీ ఆమె భౌతిక కాయానికి దుబాయ్ లో చాలా అవమానం జరిగింది. అంత పాపులారిటీ ఉన్న సెలబ్రటీ పట్ల దుబాయ్ ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరు షాక్ కలిగిస్తోంది. ఆమె భౌతిక కాయం కోసం భారత దేశంలో అభిమానులంతా ఎదురు చూస్తుంటే.. అక్కడ మాత్రం విపరీతమైన కాలయాపన జరుగుతోంది. 

sridevi dead body కోసం చిత్ర ఫలితం
శనివారం అర్థరాత్రి శ్రీదేవి మరణిస్తే.. ఆదివారం అర్థరాత్రి వరకూ కూడా ఆమె భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అందించలేదు. పోస్టు మార్టం విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. మరణించి 24 గంటలు గడిచినా ఇంకా దుబాయ్‌ ఆస్పత్రిలోనే శ్రీదేవి భౌతికకాయం ఉండటం ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. వివిధ రకాల నిబంధనలు, పరీక్షల పేరుతో దుబాయ్ లో జరుగుతున్న జాప్యం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: