శ్రీదేవి మరణం.. తర్వాతి పరిణామాలు.. ఓ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. సినీహీరోయిన్ మరణం తదుపరి పరిణామాలు కూడా సినిమానే తలపించేలా సాగుతున్నాయ. మొదట గుండెపోటుగా కుటుంబం చెప్పుకొచ్చింది. కానీ ఆమె బాత్ టబ్ లో మునిగి చనిపోయారని ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్పడం కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగిందన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

sridevi death boney kapoor కోసం చిత్ర ఫలితం
ఐతే.. శ్రీదేవి మరణవార్త వినగానే ఆమె భర్త బోనీ కపూర్ మొదట ఎవరికి ఫోన్ చేశారు..  ఇప్పుడు దుబాయ్ పోలీసుల విచారణలో బోనీకపూర్ మొబైల్ కాల్ లిస్టుపై దృష్టి సారించారు. ప్పటికే కేవలం ఆయన కాల్‌ డేటాను పరిశీలించిన అధికారులు.. అందులో ఎక్కువ సార్లు ఎంపీ అమర్‌ సింగ్‌ నంబర్‌ ఉన్నట్లు గుర్తించారు. దీనిపై అమర్ సింగ్ కూడా ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. 

sridevi boney kapoor amar singh కోసం చిత్ర ఫలితం
అమర్ సింగ్ చెప్పినదాని ప్రకారం.. ఆయనకు బోనీ కపూర్ నుంచి అర్ధరాత్రి 12గం.40ని. సమయంలో కాల్‌ వచ్చింది. కానీ సెల్‌ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో ఉండటంతో ఆయన గుర్తించలేకపోయారట. తర్వాత అమర్ సింగ్ ల్యాండ్‌ నంబర్‌కు బోనీ ఫోన్‌ చేసి శ్రీదేవి మరణవార్త చెప్పారట. విషాదవార్త కావడంతో తాను కూడా పెద్దగా మాట్లాడలేకపోయానని అమర్ సింగ్ తెలిపారు. ‘శ్రీదేవి-బోనీ కుటుంబంతో తనకు చాలా అనుబంధం ఉందని.. ఆ కుటుంబానికి ఆర్థిక కష్టాలు లేవని అమర్ సింగ్ చెప్పుకొచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: