గత కొంత కాలంగా అస్వస్థతతో ఉన్న కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి  ఈ ఉదయం పరమపదించిన సంగతి తెలిసిందే.  జయేంద్ర సరస్వతి మృతి ఆయన భక్తులకు తీరని లోటు అని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. లక్షలాది మంది భక్తుల హృదయాల్లో జయేంద్ర సరస్వతి ఉంటారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమాజం కోసం జయేంద్ర సరస్వతి ఎంతో చేశారని ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. పేద ప్రజల జీవితాలను మార్చడం కోసం ఎన్నో సంస్థలను నెలకొల్పారని చెప్పారు.

ఆయన మరణ వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ... లక్షలాది మంది గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారని చెప్పారు.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జయేంద్ర సరస్వతి మహానిర్యాణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన ఆధ్యాత్మిక, సామాజిక సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా సంతాపం తెలిపారు. ఆయన మృతి తీవ్ర విషాదాన్ని నింపిందని అమిత్ షా ట్వీట్ చేశారు.
Related image
జయేంద్ర సరస్వతి బోధనలను, ఆలోచనలను తర్వాతి తరాలు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.  తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య నిర్యాణం పొందడం పట్ల... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. కంచి పీఠాభివృద్ధికి ఆయన చేసిన సేవలను సీఎం కొనియాడారు. ఆధ్యాత్మిక గురువు జయేంద్ర సరస్వతి మృతి విచారకరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

కంచి పీఠం అభివృద్ధికి, విద్యావికాసానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఆధ్యాత్మిక చింతన, అత్యున్నత విలువలను ఆచరించి, ఇతరులకు ప్రబోధించారంటూ జయేంద్ర సరస్వతిని వైసీపీ అధినేత జగన్ గుర్తు చేసుకున్నారు. జగద్గురువుగా ఆయన ఖ్యాతి పొందారని చెప్పారు. జయేంద్ర సరస్వతి సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: