శ్రీదేవి.. భారత దేశం లో పరిచయం అక్కర్లేని నటి... ఉత్తరాది, దక్షిణాది.. దేశం మొత్తం అభిమానించే అరుదైన నటి. అలాంటి శ్రీదేవి అంతిమ యాత్రలో అనేక విశేషాలు చోటుచేసుకున్నాయి. గతంలో ఎన్నడూ ఏ సెలబ్రెటీ విషయంలో జరగని ఘటనలు శ్రీదేవి అంతిమయాత్రలో జరిగాయి. సాధారణంగా సెలబ్రెటీలు మరణిస్తే.. వారి దృశ్యాలు మీడియాకు ఇస్తారు. 

sridevi funeral కోసం చిత్ర ఫలితం
కానీ శ్రీదేవి విషయంలో ఆమె పార్థివ దేహాన్ని వీడియో తీయనివ్వలేదు. ఆమె జాతీయ స్థాయి సెలబ్రెటీ అయినా సరే.. ఆమెకు ప్రముఖులు నివాళులు అర్పించే దృశ్యాలు మీడియాకు చిక్కనివ్వలేదు. కేవలం ఆమె నివాసం వద్ద వచ్చి పోయే సెలబ్రెటీల దృశ్యాలు తప్ప ఆమెకు నివాళులు అర్పించే దృశ్యాలేమీ మీడియాకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

sridevi funeral కోసం చిత్ర ఫలితం

చివరకు ఆమె కడసారి చూపు కూడా దక్కనివ్వలేదు. ఆమెను చీరలో అలంకరించిన ఓ ఫోటో మాత్రమే మీడియాకు విడుదల చేశారు. ఆమె నివాసం వద్ద వేలసంఖ్యలో అభిమానులు ఎదురు చూస్తున్నా.. టీవీ సెట్ల ముందు కోట్లాది మంది అభిమానులు ఆత్రుతగా చూస్తున్నా వారికి నిరాశే ఎదురైంది. కేవలం ఓ ఫోటో మాత్రమే వారికి కడసారి వీడ్కోలు పలికింది. గతంలో ఏ సెలబ్రెటీ విషయంలోనూ ఇన్ని కఠినమైన నిబంధనలు పాటించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: