బుధవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠి లో ఉండగా, తెలంగాణ బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి పుష్ప లీల అక్కడికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎం లలో డబ్బులు లేవని, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయనకు వివరించారు.
దీనికి మంత్రి స్పందిస్తూ, తాము ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన దానికంటే ఎక్కువ కరెన్సీని సరఫరా చేశామని వివరించారు. అయినా, కరెన్సీ కొరత నెలకొనడం ఆశ్చర్య కరమన్నారు. నోట్ల కట్టలను ఇళ్లలో, లాకర్లలో దాచు కోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
దేశంలో ముంబయి, కలకత్తా, బంగళూరు, చెన్నై నగరాల తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇంతగా కరన్సీ కొరత లేదు. భారతీయ సెంట్రల్ బాంక్ నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ రెండు రాష్ట్రాలకు సాధారణ నగదు వితరణ కంటే ఎక్కువేనన్న సమాచారం ఉన్నట్లు తెలుస్తుంది.