బీజేపీ అగ్ర నేత అద్వానీని ప్రధాని మోడీ అవమాన పరిచారు. గురువు లాంటి వ్యక్తి నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయకుండా ప్రధాని మోదీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఈ సంఘటన త్రిపుర ముఖ్యమంత్రిగా మొదటిసారి బిజెపి విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమంలో చోటుచేసుకుంది.


ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథి అయిన మోదీ వేదికపైకి వస్తూ వరుసగా ఒక్కొక్కరికీ ప్రమాణాలు చేస్తూ ముందుకు నడిచారు. తొలుత అమిత్‌ షా, రాజ్‌నాథ్‌లకు నమస్కరించిన మోదీ.. ఆ పక్కనే చేతులు జోడించి నిల్చున్న అద్వానీవైపు మాత్రం కన్నెత్తి చూడలేదు.


అంతేనా, అద్వానీ పక్కనే ఉన్న మాణిక్‌ సర్కార్‌పై దగ్గరికి వెళ్లిమరీ ఆప్యాయత కురిపించి, రెండు సెక్లను మాట్లాడారు. అంతసేపూ అద్వానీ చేతులు దండం పెడుతూనేఉన్నా.. మోదీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు ‘గురువుని గౌరవించని శిష్యుడు’,...’బాగా గర్విస్తున్న మోడీ’,....’అద్వానీని లెక్కచేయని మోడీ’.....అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: