ఓటుకు నోటు కేసు ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పటి నుంచి చంద్ర బాబు నాయుడు కాపాడుకుంటూవస్తున్న పరువు అంత గంగలో కలిసి పోయింది. సిఎం కెసిఆర్ బాబుకు ముచ్చెమటలు పట్టించాడు. దానితో దేబ్బకు హైదరాబాద్ వదిలి అమరావతికి మఖాం మార్చినాడు. అయితే ఇప్పుడు రాజ్య సభ సీటు విషయం లో చంద్ర బాబు ఎక్కడ వైసిపి ఎమ్మెల్యేలను కొనబోయి మళ్ళి ఇబ్బంది పడతాడని గ్రహించి నట్టున్నాడు. 

Image result for chandra babu cash for vote

మూడో అభ్యర్దిని నిలబెట్టడం లేదు. రెండు సీట్లకు మాత్రమే పోటీ అని ప్రకటించేసింది. మరి రెండు సీట్లూ ఎవరికి? అనేది పెద్ద పితలాటకంగా మారింది. ఏదైనా ఆఖరి నిమిషం వరకూ నాన్చడం చంద్రబాబు నైజమే కదా. అందుకే ఇప్పుడు రెండు సీట్ల విషయంలోనూ తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. తెలుగుదేశం అనుకూల పత్రికలు ఇస్తున్న సమాచారం ప్రకారమే.. ఏకంగా పదిమంది బరిలో నిలబడుతూ ఉన్నారని తెలుస్తోంది.
Image result for chandra babu cash for vote
వీళ్లంతా చంద్రబాబు దగ్గర తమ గోడును వెల్లబోసుకుంటున్నారట. తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టుగా టాక్. ఇక పవన్ కల్యాణ్ రెఫరెన్సు, ఒక పత్రికాధినేత ఆదేశం.. ఇవన్నీ ఉండనే ఉన్నాయి. ఇంత  పోటీ ఉన్నదీ రెండు సీట్ల కోసమే. వీళ్లలో చాలా మంది చంద్రబాబు నాయుడు తమకు హామీ ఇచ్చారని చెప్పుకొంటూ ఉంటున్నారు. మరి రెండు సీట్ల విషయంలో అంత మందికి హామీ ఎలా ఇచ్చారనేది కూడా వీళ్ల మధ్యనే జరుగుతున్న చర్చ. ఇక వైకాపా మాత్రం.. చంద్రబాబు మూడో సీటు విషయంలో పోటీకి రాకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవంగా ముగుస్తుందనే ఆనందంతో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: