దేశవ్యాప్తంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు.. అత్యాచారాలకు తెగబడుతున్నారు. అక్కడితో ఆగకుండా దాన్ని వీడియోలు తీసి నానారకాలుగా బెదిరిస్తున్నారు. ఆడవాళ్లజీవితాలలో ఆడుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్ లోని ఓ జిల్లాలో ఇలాంటి ఘోరమే జరిగింది. 

Related image
రాజస్థాన్‌లోని బరన్‌ జిల్లాలో ఆరుగురు యువకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. కోటాలోని ఓ దాబాలో పనిచేస్తున్న మహిళ బంధువుల ఇంటికి వెళ్తోంది. దారిలో ఆమెకు  తెలిసిన యువకుడు తారసపడ్డాడు. ఎంతవరకూ నడుస్తావు.. మీ ఇంటి వద్ద దించుతానంటూ ఆ దుర్మార్గుడు నమ్మబలికాడు. ద్విచక్రవానం ఎక్కించుకున్నాడు. ఆమెను ఇంటికి తీసుకెళ్లకుండా దారి మళ్లించాడు. 


ఆమెను నేరుగా ఓ నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే అతని స్నేహితులు ఐదుగురు ఎదురుచూస్తున్నారు. ఆమెను తీసుకెళ్లిన దుర్మార్గుడితో పాటు ఆ ఐదుగురు ఆమెను బలాత్కరించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియోల గురించి తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వీడియోల ద్వారా కీచకులను గుర్తించిన పోలీసులు వారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: