నానాటికి దేశంలో ఆడవాళ్ళకు రక్షణ కరువవుతుంది.ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా,ఎన్ని చట్టాలు రూపొందించినా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచదేశాలను పరిశీలించి చూస్తే ఆడవాళ్ల మీద జరిగే దాడుల్లో భారత్ మొదటి 15 స్థానాల్లోపు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అంచనావేయవచ్చు .


తాజాగా బళ్లారిలో జరిగిన ఒక సంఘటన పోలీసుపై ఉన్న నమ్మకాన్ని పోగెట్టేలా ఉంది. రక్షణ కలిపించాల్సిన పోలీసే కామాంధుడయ్యాడు. ఒక మహిళ  స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి దాన్ని అడ్డుపెట్టుకొని ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. వివరాల్లోకివెళితే బళ్లారి జిల్లాలోని హోస్ పేట కు చెందిన పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు వెంకటేష్.


తన పక్కింట్లో ఉండే ఒక వివాహిత బట్టలు మార్చుకొని స్నానం చేస్తున్న టైములో వీడియో తీసాడు. ఆ వీడియోను అడ్డం పెట్టుకొని తన కోరిక తీర్చమంటూ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఒక వేళ అలా చేయని పక్షంలో ఆ వీడియో ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపులకు పాల్పడేవాడు. గత కొంతకాలంగా వెంకటేష్ వేధింపులు భరిస్తూ వస్తున్న ఆమె ఇక భరించలేక మొత్తం విషయాన్ని తన భర్తకు చెప్పింది. దీంతో భర్త  వెళ్లి వెంకటేష్ తో మాట్లాడగా స్మగ్లింగ్ కేసులో ఇరికిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేసింది. విషయం తెలుసుకున్న వెంకటేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: