కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు తెగబడ్డారు. సుకుమా జిల్లా గొల్లపల్లి-కిష్టారం గ్రామాల మద్య దారుణ ఘటన. జవాన్లపై మావోయిస్టుల మెరుపుదాడి. 9 మంది జవాన్లు మృతి..మరో ఆరుగురు జవాన్లకు తీవ్ర గాయాలు.
ఇటీవల పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు మందుపాతరలు పేల్చి జవాన్ల ప్రాణాలు తీశారు. మంగళవారం సీఆర్పీఎఫ్ జవాన్లు వ్యాన్లో ప్రయాణిస్తుండగా గొల్లపల్లి-కిష్టరాం గ్రామాల మధ్య మందుపాతర పేల్చారు. ఆ తర్వాత కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 9 సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందగా.. మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను రాయ్పూర్ ఆస్పత్రికి తరలించారు. జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తెలంగాణలోని తడపలగుట్ట, ఛత్తీస్గఢ్లోని పూజారికాంకేడు అటవీ ప్రాంతం సరిహద్దుల్లో ఈ కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్స్ కు చెంది ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు.