కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు తెగబడ్డారు.  సుకుమా జిల్లా గొల్లపల్లి-కిష్టారం గ్రామాల మద్య దారుణ ఘటన.  జవాన్లపై మావోయిస్టుల మెరుపుదాడి. 9 మంది జవాన్లు మృతి..మరో ఆరుగురు జవాన్లకు తీవ్ర గాయాలు. 
Image result for maoist attack sukma
ఇటీవల పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు మందుపాతరలు పేల్చి జవాన్ల ప్రాణాలు తీశారు. మంగళవారం సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వ్యాన్‌లో ప్రయాణిస్తుండగా గొల్లపల్లి-కిష్టరాం గ్రామాల మధ్య మందుపాతర పేల్చారు. ఆ తర్వాత కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 9 సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందగా.. మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
sukma crpf
క్షతగాత్రులను రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తెలంగాణలోని తడపలగుట్ట, ఛత్తీస్‌గఢ్‌లోని పూజారికాంకేడు అటవీ ప్రాంతం సరిహద్దుల్లో ఈ కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్స్ కు చెంది ఓ కానిస్టేబుల్‌ మృతి చెందాడు.

Image result for maoist attack sukma


మరింత సమాచారం తెలుసుకోండి: