ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్స్ చేశాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో స్థిరనివాసం అలాగే పార్టీ కార్యాలయం కోసం కొనుగోలు చేసిన భూమి పై కత్తి మహేష్ సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్  వేసిన పునాది అవినీతి పునాది అని సంచలన ట్వీట్ చేశారు. ఇలా ఒకటి కాదు వరుసగా రెండు ట్వీట్లు చేశారు.


‘‘జనసేన పార్టీ ఆరంభంలోనే బానిసత్వం ఉంది. పవన్ కల్యాణ్ రాజకీయ పంథాలోనే జీ హుజూరి ఉంది. పార్టీ ఆఫీస్ నిర్మాణపు పునాదిలోనే అవినీతి ఉంది. ఇది మార్పు కోసం వస్తున్న రాజకీయం కాదు.. ఏమార్చడానికి కొనసాగుతున్న పవనిజం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు మహేష్. అంతకు ముందు మరో ట్వీట్‌లో ‘‘పవన్ కల్యాణ్‌కి ఇచ్చిన ల్యాండ్ డీల్ నాకు ఇస్తే, పవన్ కల్యాణ్ పక్కన ఫ్లాట్ తీసుకుని అమరావతి షిఫ్ట్ అవ్వడానికి నేను రెడీ!’’ అని ట్వీట్ చేశారు.


ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్న తరుణంలో కత్తి మహేష్ ఇలా ట్విట్ చేయడం చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో కొందరు జనసేన కార్యకర్తలు కత్తి మహేష్ వైసీపీ కార్యకర్త అని సోషల్ మీడియాలో సంచలన కామెంట్స్ చేస్తున్నారు.


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ మహాసభ ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. గుంటూరు వేదికగా జరుగుతున్న ఈ మహాసభకు రాష్ట్ర నలుమూలల నుండి జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా హాజరవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: