సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి జనసేన అనే పార్టీని నెలకొల్పిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ ఆవిర్భవించి అప్పుడే నాలుగేళ్లు నిండాయి. ఇందుమూలంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు గుంటూరు లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటుచేయాలని భావించారు. గుంటూరు జిల్లా నాగార్జునా యూనివర్శిటీ ఎదుట ప్రాంగణంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంది.


ఈ సభ వేదికగా పవన్‌కల్యాణ్‌ పార్టీ భవిష్యత్తు ప్రణాళికను వెల్లడించి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే ఈ పార్టీకి సంబంధించి అజెండా లీక్ అయింది. ఈ లీక్ చేసిన వ్యక్తి ఎవరో కాదు ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్. పవన్ ఫ్యాన్స్ తో వివాదం సమసిపోయినా పవన్ గురించి ట్వీట్లు చేయడం మానలేదు. వీటిని కూడా పవన్ ఫ్యాన్స్ పట్టించుకోవడం మానేశారు. 


అయితే ఉన్నట్లుండి జనసేన అజెండా ను ట్విట్టర్లో లీక్ చేసి అందరినీ షాక్ కు గురిచేశాడు. కత్తి ఆయన ట్విట్టర్ అకౌంట్లో 
"1. అన్ని అసెంబ్లీపార్లమెంటు నియోజకవర్గాలలో జనసేన ఒంటరి పోటీ. 
2. ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో ఒంటరిగా ఢీ!
3. రెడ్లు, కమ్మలు, వెలమల, రాజులు,బ్రాహ్మలు లేకుండా కాపులు, బిసిలు, దళిత బహుజనులు మాత్రమే అన్ని సీట్లు. 
4. డబ్బులు, మద్యం, ఎన్నికల ప్రలోభాలు లేకుండా బరిలోకి. ఇదే పవన్ అజెండా !" అంటూ పై విధంగా రాసుకొచ్చాడు. మరి ఇది నిజామా కాదా అని తెలుసుకోవాలంటే కొద్దిసేపు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: