ఎంత టాప్ ర్యాంకర్ విద్యార్థి అయినా ఎగ్జామ్స్ అంటే ఒకింత భయమే ఉంటుంది.  కొంత మంది విద్యార్థులు ఎగ్జామ్స్ అంటే ముందు నుంచి ఒకరకమైన భయం కలిగి ఉంటుంది. అలాంటి ఓ విద్యార్థి భయం ఆసరగా చేసుకొని పదో తరగతి వార్షిక పరీక్షలను వేరే విద్యార్థితో రాయించి పాస్ చేయిస్తానని నమ్మించి ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు.  విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్ కి బంగారు బాటాలు వేయాల్సిన ఓ ఉపాధ్యాయుడు తన వక్రబుద్దితో బాలిక జీవితంతో ఆడుకున్నాడు.
Image result for rape images
చంఢీగడ్‌లోని సోనిపట్ జిల్లా, గొహనా పట్టణంలో చోటుచేసుకుంది. ఇద్దరు మహిళల సాయంతో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి చెప్పిన వివరాల్లోకి వెళితే.. తన కుమార్తెను పాస్ చేసేందుకు ప్రిన్సిపాల్‌తో పదివేల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పాడు.  మార్చి 8న ప్రిన్సిపాల్ తనకు ఫోన్ చేసి కుమార్తెతో కలిసి రావాల్సిందిగా కోరారని, అక్కడి వెళ్లాక ఆమె పరీక్షలు రాయాల్సి ఉంటుందన్న ప్రిన్సిపాల్.. తనను వెళ్లమన్నాడని బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపాడు.
Image result for rape images
ఇంటికి వచ్చిన ఆ విద్యార్థిని చెప్పిన మాటలకు తండ్రి షాక్ అయ్యారు..ప్రిన్సిపాల్ తనను అత్యాచారం చేశారని విద్యార్థిని కన్నీరు మున్నీరు అయ్యింది.  ఇద్దరు మహిళలు తనను ఒప్పించారని చెప్పినట్టు బాలిక తండ్రి తెలిపారు. బాలిక వాంగ్మూలం అనంతరం పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. కాగా, రెండు నెలల్లో  ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.


మరింత సమాచారం తెలుసుకోండి: