తెలంగాణ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.1,74,453 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించామని చెప్పారు. నూతన పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చామని తెలిపారు.

సంక్షేమ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేశారని చెప్పారు. రెవెన్యూ వ్యయం రూ.1,25,454 కోట్లుగా ఉందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ఆదాయం రూ.73,751 కోట్లని తెలిపారు. దీనిలో కేంద్ర వాటా రూ. 29,041 కోట్లని పేర్కొన్నారు. ఈటల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతుల మధ్య సమన్వయం కోసం... రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు.

2018-19 బడ్జెట్ హైలైట్స్ :

- తెలంగాణ రాష్ర్ట మొత్తం బడ్జెట్ రూ. 1,74,453 కోట్లు

- రెవెన్యూ వ్యయం రూ. 1,25,454 కోట్లు, రెవెన్యూ మిగులు అంచనా రూ. 5,520 కోట్లు

- రాష్ట్ర ఆదాయం రూ. 73,751 కోట్లు

- కేంద్ర వాటా రూ. 29,041 కోట్లు 

- ద్రవ్యలోటు అంచనా - రూ. 29,077 కోట్లు

- రాష్ట్ర జీడీపీ ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది రాష్ర్ట జీడీపీ 10.4 శాతంగా ఉంటుందని అంచనా

- గతేడాది తలసరి ఆదాయం రూ. 1,75,534 కోట్లు

- స్థూల ఉత్పత్తిలో గణనీయ ప్రగతి సాధించాం

- కోల్డ్ స్టోరేజీ, లింకేజీలకు - రూ. 132 కోట్లు 

- డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ. 2,643 కోట్లు

-  నీటిపారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు

- పంటల పెట్టుబడి మద్దతు పథకానికి రూ. 12 వేల కోట్లు

-  రైతు బీమా పథకానికి రూ. 500 కోట్లు.. ఒక్కో రైతుకు రూ.5 లక్షల బీమా

-  వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 522 కోట్లు, బిందు తుంపర సేద్యం రూ. 127 కోట్లు

-  పౌరసరఫరాల శాఖకు రూ. 2946 కోట్లు

- ఆసరా పెన్షన్లకు - రూ. 5300 కోట్లు

-  కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు రూ.1,450 కోట్లు

-  మహిళా శిశుసంక్షేమానికి రూ. 1,799 కోట్లు

-  కొత్త పారిశ్రామిక విధానంతో పెట్టుబడుల ఆకర్షణ

-  వ్యవసాయంలో దేశానికే తెలంగాణ ఆదర్శం

-  2018-19 నుంచి రైతుకు ఎకరాకు రూ.8వేల పెట్టుబడి

-  రైతు పెట్టుబడి సాయానికి రూ. 12వేల కోట్ల కేటాయింపు

-  100 రోజుల్లోనే భూరికార్డుల ప్రక్షాళన చేశాం.

-  త్వరలో ధరణి వెబ్‌సైట్‌ను ఆవిష్కరిస్తాం.

-  గ్రామీణ సంస్థలకు రూ. 1500 కోట్లు.. పట్టణాభివృద్ధికి రూ. 1,000 కోట్లు

-  మిషన్ కాకతీయకు రూ. 25 వేల కోట్లు

-  పాలీ హౌస్, గ్రీన్ హౌస్‌కు రూ. 120 కోట్లు

-  మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు రూ. 1,000 కోట్లు

-  దళితుల భూ పంపిణీకి రూ. 1469 కోట్లు

- ఆరోగ్య లక్ష్మి పథకానికి - రూ. 298 కోట్లు

- ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి - రూ. 9,693 కోట్లు

- ఎస్సీ అభివృద్ధి శాఖకు - రూ. 12,709 కోట్లు

- ఎస్టీల అభివృద్ధి శాఖకు - రూ. 8,063 కోట్లు

- దళితుల భూ పంపిణీకి - రూ. 1,469 కోట్లు

- మైనార్టీల సంక్షేమానికి - రూ. 2వేల కోట్లు

- అమ్మ బడి పథకానికి - రూ. 561 కోట్లు

- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు - రూ. 15,563 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: