సమాజంలో మహిళలంటే ఉన్న గౌరవాన్ని కొందరు అమ్మాయిలు దుర్వినియోగం చేస్తున్నారు. ఇష్టారీతిన బరితెగించి ఆడవాళ్లంటే గౌరవం లేకుండా చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేప‌ల్లి మండ‌లం ధ‌ర్మారావుపేట పంచాయ‌తీ ప‌రిధిలోని శ్రీరాముల ప‌ల్లెలో జరిగిన ఈ ఘోరం చూస్తే ఎవరైనా ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ గ్రామానికి చెందిన న‌క్క ధ‌ర్మరాజుకు జ‌గిత్యాల జిల్లా క‌న్నాపూర్‌కు చెందిన ముద్దం నాగ‌ల‌క్ష్మితో గ‌తేడాది పెళ్లయింది. 


ఐతే.. నాగలక్ష్మికి పెళ్లికి ముందే మహేశ్ అనే కుర్రాడిని ప్రేమించింది. మరి ఆ విషయం గట్టిగా చెప్పి పెళ్లిని అడ్డుకున్నా బావుండేది. అలాకాకుండా ధర్మారాజుతో పెళ్లికి ఒప్పుకుంది. ధర్మరాజుతో పెళ్లయినా మహేశ్ తో ప్రేమాయణం మాత్రం కొనసాగిస్తూనే ఉంది. పుట్టింటికి వెళ్లినప్పుడు అతనితో రోమాన్స్ చేస్తోంది. అంతే కాదు.. ఇంకో అడుగుముందుకు వేసి అత్తారింటికి వచ్చాక కూడా అతనితో భర్త ఎదురుగానే ఫోన్ లో మాట్లాడేదట. 


ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక ధర్మారాజు సతమతమవుతున్నాడు. ఇంతలో పుట్టింటికి వెళ్లిన నాగలక్ష్మి ప్రియుడితో కలసి కొత్త ప్లాన్ వేసింది.. ప్రియుడితో రొమాన్స్ చేస్తూ సెల్ఫీ వీడియోలు తీసుకుంది. అసభ్యకర భంగిమల్లో ఫోటోలు, వీడియోలు తీసుకుని వాటిని ఏకంగా భర్తకు పంపేసింది. ఇవన్నీ చూసి తనను వదిలేస్తే ప్రియుడితో సెటిల్ కావచ్చన్నది ఆమె ప్లాన్ కావచ్చు.

Image result for WIFE ROMANCE
ఆ వీడియోలు చూసిన ధర్మరాజు షాకయ్యాడు. అందులో ఓ వీడియోలో ధర్మరాజు కట్టిన తాళిని తీసేసి ప్రియుడు మహేశ్ చేతులతో వేయించుకుంది. ఆ దృశ్యాలు చూసి ధర్మరాజు మనసు విరిగిపోయింది. అవమానంగా ఫీలై పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా మూడు రోజుల చికిత్స తర్వాత కన్నుమూశాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: