ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే వివిధ పార్టీల మద్దతు కూడగడుతున్న చంద్రబాబు. ఢిల్లీలో హై ఓల్టేజ్ రాజకీయం. మోడీ సర్కార్ పై టీడీపీ అవిశ్వాస తీర్మానానికి పెరుగుతున్న మద్దతు.
కాంగ్రెస్, టీఎంసీ,టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఆప్, ఆర్జేడీ,ఎంఐఎం, ఏఐడీఎంకే మద్దతు. కాగా, అకాలిదల్ మాత్రం అవిశ్వాస తీర్మాణానికి దూరంగా ఉంది. అవిశ్వాస తీర్మానానికి కనీసం 54 మంది సభ్యుల మద్దతు అవసరం.
కాగా, వైసీపీ అవిశ్వాస తీర్మానానికి శివసేన మద్దతు. పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన శివసేన, ఢిల్లీకి పయనం. అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాల మద్దతు కూడగడుతున్న టీడీపీ. అవిశ్వాస తీర్మానానికి కనీసం 54 మంది సభ్యుల మద్దతు అవసరం.