గడచిన నెలల్లో తెలుగు రాష్ట్రాలలో పవణ్ ఫ్యాన్స్ మరియు కత్తి మహేష్ మధ్య నడచిన వార్ మాములు రచ్చ లేపలేదు. ఇంక వివాదం కు ఫుల్ స్టాప్ పడదనుకున్న సమయంలో ఎట్టకేలకు జనసేన ప్రతినిథులు రంగంలోకి దిగి ఆ వివాదానికి శుభం కార్డు వేశారు. అయితే ఆ సమస్య సమసిపోయినా కత్తి మహేష్, జనసేన పార్టీ మీద మరియు ఆ పార్టీ అధినేత పవణ్ కల్యాణ్ మీద విమర్శలు చేస్తుంటాడు.


తాజాగా పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో గుంటూరు సమీపంలో ఇల్లు కట్టబోతున్నాడన్న సంగతి అందరికి తెలిసిందే. మొత్తం రెండెకరాలలో నిర్మించబోతున్న ఇంటి ఆవరణంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి భూమి పూజ కూడా చేశాడు. భార్య అన్నా లెజినోవాతో కలిసి నిర్మాణ హోమాన్ని కూడా నిర్వహించాడు. ఇంటి నిర్మాణ విషయంలోనూ కత్తి, పవన్ ను వదల్లేదు.


"బిజేపీ-తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో జనసేన అధినేత ఇల్లు. జనసేన పార్టీ ఆఫీస్ నిర్మాణం. అభినందనలు" అని తెలుపుతూ తన ట్విట్టర్ అకౌంట్లో రాసుకొచ్చాడు. అంతటితో ఆగని కత్తి  "పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ల్యాండ్ డీల్ నాకు ఇస్తే, పవన్ కళ్యాణ్ పక్కన ప్లాట్ తీసుకుని అమరావతి షిఫ్ట్ అవ్వడానికి నేను రెడీ!" అంటూ ట్వీటు చేసి బాంబు పేల్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: