జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఆయన కుమారుడు లోకేష్ పై చేసిన షాకింగ్ కామెంట్స్ తెలుగుదేశం నాయకులకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ ఇంతకాలం మంచివాడైన చంద్రబాబు ఒక్కరోజులోనే చెడ్డవాడు ఎలా అయ్యాడు అని నిలదీస్తున్నారు చంద్రబాబు.
నేను చెడ్డవాడిని అయితే ఇంతకాలం 40 ఏళ్లు రాజకీయాలు చేసేవాడిని కాదు అని అంటున్నారు. రాబోయే ఎన్నికలలో ఓట్లకు డబ్బులు పంచడంపై పవన్ చేసిన ఆరోపణలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ‘నియోజకవర్గానికి రూ.25 కోట్లు పంపుతున్నామంటూ పవన్ ఆరోపణలు చేస్తున్నారు.. అసలు ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలని కోరుతుందే నేను కదా..’ అని అన్నారు.
ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్పై ఫైర్ అయ్యారు. ‘ఎలాంటి ఆధారాలు లేకుండా లోకేష్పై ఆరోపణలు చేసారు పవన్. అయితే గతంలో ప్రజారాజ్యం పార్టీకి 70 లక్షల మంది ఓట్లు వేశారు వాళ్లందరినీ మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి మీ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని అమ్మేశారు. మరి అదేవిధంగా మీ అన్న రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూడా ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించకపోవడాన్ని ప్రశ్నించవేం’ అని నిలదీశారు.
శుక్రవారం టిడిపి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్పై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. మొత్తంమీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఎదురుదాడికి దిగారు తెలుగుదేశం నాయకులు.