ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యే రోజా కొంత కాలంగా అధికార పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏ చిన్న చాన్స్ దొరికినా పార్టీ అధినేత, సభ్యులపై దుమ్ముత్తిపోయండం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఏపీ ప్రత్యేక హోదా పై ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆగ్రహంగా ఉన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని ఇప్పటికైనా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించాలని పట్టుబడుతున్నారు.  ఇప్పటికే వైసీపీ అవిశ్వాస తీర్మాణం పెట్టగా..టీడీపీకి కూడా అవిశ్వాస తీర్మాణం పెట్టింది. 
Image result for mla roja
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాచవరం మండలంలో జరిగిన దళిత తేజం-తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..లక్షల కోట్లు మింగిన తమ అధినేత బాగోతాలు అందరికీ తెలుసని..రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ది కోసం అహర్శశలూ కష్టపడుతున్న తమ అధినేత చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు.
Image result for ap cm chandrababu
ముఖ్యమంత్రి చంద్రబాబుపై, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే... చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పల్నాడు ప్రాంతాన్ని ఎన్నడూ లేనంతగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తుంటే... ఓర్వలేక వైసీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. గతంలో మాచర్ల ఎమ్మెల్యే కొంత మంది రౌడీలతో దాడిచేయించి..పచ్చని పంట పొలాలను దున్నిన విషయం అందరికీ గుర్తుందని చెప్పారు. పంటలు నష్టపోయిన రైతులకు తన సొంత డబ్బు ఇచ్చి ఆదుకున్నానని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: