రాజకీయాలు ఎంత అరాచకమైనా చేస్తాయి. ఇరుపక్షాలకి పదవి లాలస, ధన వ్యామోహం, అధికార మధం కావలసినంత ఉంది. రాష్ట్రంలో అధికార పక్షం, విపక్షం, చివర కు కేంద్రంలోని, దేశంలోని అన్నీపక్షాలు అంతే రాజకీయం తీరిది. వజ్రాన్ని వజ్రంతో కోయాలి, ముల్లును ముల్లుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే ముగించాలి వీటిని నిజం చేయటానికి కావలసింది వజ్ర సంకల్పం.
ఈ సామెతలను ఆంధ్రప్రదేశ్ విపక్షం వైసిపి చక్కగా అమలులో ఆచరణలో పెడుతోంది. కొత్త కొత్త రాజకీయ వ్యూహాలను, ఆలోచనా చమత్కృతులు అమలు చేయటం ద్వారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ను జాతీయ స్ధాయిలో 'క్రిందకు ఈడ్చటం' మొదలుపెట్టింది. ఇంతకాలం తమపై తెలుగు దేశం పంచమాంగ దళాలు ఏ విధమైన ముద్ర వేసి ప్రచారం చేశాయో, అదే పద్దతిని ఇప్పుడు వైఎసార్సిపి కూడా అదే దారిని అనుసరిస్తోంది.
ఎప్పుడైతే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏను వదిలేసి బయటకు వచ్చేశారో, వెనువెంటనే తమపై గతంలో బాబు బృందం ఏ వ్యూహాన్ని ప్రయో గించారో అదే వ్యూహాన్ని అద్భుతంగా అమలులోకి తెచ్చింది. అసలు విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు, లోకేష్ లు అంటే తండ్రి తనయులు ఇద్దర్ని ఆర్ధిక ఉగ్రవాదులుగా ముద్రవేయటం. కొద్ది సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్దిపై పై అధికార టిడిపి అటు శాసనసబ్ హలో ఇటు బహిరంగ వేదికలపై అదే పని చేసిన సంగతి మనందరికి తెలియంది కాదు.
తనకు మద్దతుగా నిలిచే అనేక మీడియా హౌజెస్ తో పాటు సామాజిక మీడియాలో కూడా తమ వందిమాగధులచే వైసిపి జగన్ మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా ధారుణ పరాభవ ప్రచారం చేయించింది. అంతేకాదు ఆ మీడియా వ్యవస్థల చేత వారి వారి కథనాలను వండి వార్పించింది. ఇంకే దారి చూపిన దేవత టిడిపి దారిలోనే ఎన్డీఏ నుండి బయటపడ్ద చంద్రబాబుపై ఢిల్లీలో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒకేసారి తండ్రి, కొడుకులపై అదే ఆరోపణలు చేయటం ప్రారంభించారు. నిన్న మొన్న జాతీయ మీడియా కు జగన్ ఇచ్చిన ఇంటర్య్వూల్లో కూడా చంద్రబాబు, లోకేష్ అవినీతినే ప్రధానంగా ప్రస్తావించటం గమనార్హం. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఆర్ధిక, సామాజిక, రాజకీయ నేరగాళ్ళుగా ముద్ర వేయటం కొనసాగుతూనే ఉంది.
మొత్తం పార్టీ నేతలంతా అదే పద్దతిలో తండ్రి కొడుకులపై ఆరోపణలు మొదలు పెట్టారు. జాతీయ స్ధాయిలో అదే ప్రచారం జోరు అందుకుంది. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేటపుడు విజయసాయి ప్రత్యేకించి చంద్రబాబు, లోకేష్ అవినీతిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్ధాయిలో తండ్రి, కొడుకుల అవినీతి అంటే ప్రత్యేక కథనాలు వచ్చేట్లు చర్యలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.
నలభై యేళ్ళ సుధీర్ఘ రాజకీయ అనుభవం మూటకట్టుకున్న భారతీయ ప్రముఖుడు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుగారు వేసిన రహదారిలోనే ఇప్పుడు అనుభవం తక్కువ జగన్మోహన్ రెడ్డి కూడా నడవటం మొదలెట్టారు. పాపం మీరు నేఱ్పిన విద్యయే నీరజాక్షా! అనేలా గుణపాఠం చెప్పబోతున్నట్లే ఉంది.