ఇటీవల గుంటూరు వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని ఆయన కుమారుడు లోకేష్ చేస్తున్న అవినీతిని ప్రశ్నించడం జరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పవన్ పై ఎదురుదాడికి దిగుతూ ప్రశ్నలతో మాటలతో పవన్ కళ్యాణ్ ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు.


ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు..ప్రశ్నించే పవన్ కే సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. పార్టీని నడిపేందుకు డబ్బులు లేవన్న పవన్ ఖరీదైన ప్రాంతంలో ఇల్లు ఎలా నిర్మిస్తున్నారో చెప్పాలి? అని సూటి ప్రశ్న వేశారు అంతేకాదు పవన్‌ ఒకరోజు సినిమా సెట్లో.. మరో రోజు రాజకీయ సెట్లో ఉంటారని…పవన్ ప్రవర్తన రోజుకో విధంగా మారుతోందన్నారు.


బాధ్యత కలిగిన వ్యక్తి అర్థరహిత ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి హితవు పలికారు…ఏమైనా ఆరోపణలు చేస్తే వాటికి ఆధారాలు రుజువులు ఉండాలని అన్నారు. అంతేకానీ ఇలా అర్ధం లేని వ్యాఖ్యలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను గందరగోళం చేయడం సబబు కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు రవీంద్ర.


ఈ నేపథ్యంలో కొల్లు రవీంద్ర ఇంకా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రమేనని అన్నారు. అంతేకాకుండా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కష్టపడుతున్న చంద్రబాబునాయుడుతో కలిసి పనిచేయాలని సూచన ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర పవన్ కళ్యాణ్ కి

మరింత సమాచారం తెలుసుకోండి: