ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు హీరో శివాజీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఈ ఇద్దరూ దొంగనాటకాలు ఆడుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకరిమీద ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు.


ప్రత్యేక హోదా పోరాటం లో చిత్తశుద్ధితో పోరాడుతున్న నాయకులు చలసాని శ్రీనివాస్ అలాగే వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ చేసారు శివాజీ….ప‌వ‌న్ క‌ల్యాన్‌, చంద్ర‌బాబులు వారివారి స్వార్ధ ప్ర‌యోజ‌నాల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వారిని విడ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు.


వారిని తెలుగు ప్ర‌జ‌లు మెడ‌ప‌ట్టి గెంటేయాల‌ని కోరారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనందరం కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు శివాజీ. యువతకు ఉద్యోగాలు రావాలన్నా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.


భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిది అని అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా విషయంలో ప్రతి ఆంధ్రుడు భవిష్యత్ తరాల కోసం పోరాడాలని అన్నారు శివాజీ.

మరింత సమాచారం తెలుసుకోండి: