ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇంతవరకూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసేవారు... కానీ బాబు నిర్లక్షమో, లేక ఆయన చేస్తున్న పరిపాలన నచ్చకో కానీ మిత్ర పక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాబుపై అలాగే తెలుగు దేశం నాయకులపై గుంటూరు ప్లీనరీ వేదికగా చేసుకుని సంచలన కామెంట్లు చేసిన విషయం గురించి తెలిసిందే.
ఒక్కసారిగా పార్టీ వార్సికోత్సవంలో అధికార పార్టీపై ఆరోపణలు చేయడం చూస్తుంటే పవన్ తన పంధాను మార్చుకున్నట్లు అర్దం అవుతుంది. ఈ మద్య గుంటురు లో డయేరియా వ్యాధి బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాన్ మరోసారి టీడీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అని..ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించాలని అని లేదంటే బంద్ చేస్తానని హెచ్చరించారు.
తాజాగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును టార్గెట్ చేశారు. చంద్రబాబు సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.జాతీయ మీడియా న్యూస్ మాట్లాడిన పవన్.. చంద్రబాబు తనయుడు లోకేశ్, ఇతర టీడీపీ నేతల అవినీతి గురించి ఆ పార్టీకి చెందిన 40మంది ఎమ్మెల్యేలు, నేతలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.
చంద్రబాబు అవినీతి గురించి తానేమీ ఆకస్మాత్తుగా ఆరోపణలు చేయడం లేదని, గతంలోనే చంద్రబాబు దృష్టికి అవినీతి అంశాన్ని తీసుకెళ్లానని, ఆయన సీరియస్గా పట్టించుకోలేదని, తన ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసునని అన్నారు.