కేరళా ఎంపీ జోస్ మణి భార్య నిషా జోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లైంగిక వేధింపులకు గురైనట్లు తన ఆత్మకథలో ఆమె వెల్లడించడం కలకలంరేపింది. రైలు ప్రయాణ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె తన ఆత్మకథలో వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. కేరళా కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎం మణి కోడలైన నిషా జోస్...నేరుగా ఎవరి పేరును ప్రస్తావించకుండా ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. 2012లో తనతో కలిసి ప్రయాణించిన ఓ రాజకీయ నేత తన హద్దులు దాటారని వ్యాఖ్యానించారు.
Nisha Jose
ఆ వ్యక్తి తన కాలును ఉద్దేశపూర్వకంగా పలుమార్లు తాకారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను ట్రైన్‌ టికెట్‌ ఎగ్జామినర్‌ (టీటీఈ)కు ఫిర్యాదు చేసినా ఆయన తనకు సాయపడలేదన్నారు. నిందితుడికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే తాను ఇబ్బందుల్లో పడతానని అతను భయపడినట్టు చెప్పారని ఆరోపించారు. అంతే కాదు  నిందితుడు మిత్ర పక్షానికి చెందిన నేత కావడంతో సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోమని రైల్వే అధికారి తనకు ఉచిత సలహా ఇచ్చారని ఆమె రాసుకొచ్చారు. 

ప్రస్తుతం నిషా జోస్ మామ కేకే మణి కేరళ కాంగ్రెస్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. నిషా తన పుసక్తంలో ఎవరి పేరు ప్రస్తావించలేదు. కానీ ఆమె తనను ఉద్దేశించే అలా రాసుకొచ్చిందని ఆరోపిస్తూ.. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పీసీ జార్జ్ కుమారుడైన షోన్ జార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో షోన్ జార్జ్, నిషా ఇద్దరూ కేరళ కాంగ్రెస్ తరఫున పని చేశారు. తన పుస్తకానికి ప్రచారం కల్పించడానికే నిషా తమ గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని జార్జ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: